కమ్యూనిస్టు రక్త చరిత్ర- ఇండియన్ వర్షన్

6/06/2011 - రాసింది karthik at Monday, June 06, 2011
(ఆంధ్రజ్యోతి ఆదివారం పేపర్లో వచ్చిన ఈ కథనం చూడగలరు.. 5వ పేజి క్లిక్ చేసి పీడి ఎఫ్ గా డౌన్లోడ్ చేసుకోగలరు..  )

కమ్యూనిష్టులు చెప్పే సమసమాజ స్థాపన లోని డొల్ల తనాన్ని బయటపెట్టే నిజాలు ఒకటొకటిగా వెలుగు చూస్తున్నాయి.. బెంగాల్ లో 34 ఏళ్ళ పాటూ పాలించాం అని జబ్బలు చరుచుకునే ఈ గోముఖ వ్యాఘ్రాలు అసలు అన్నాళ్ళు తమ అధికారాన్ని నిలుపుకోవడానికి ఏం చేశారో సాక్ష్యాలతో సహా బయటకు వస్తుంటే ఇలాంటి రాక్షస మూక కు ఆధునిక సమాజం లో చోటు ఎలా దక్కింది అని సగటు పౌరుడు ముక్కున వేలేసుకుంటున్నాడు.. మిడ్నాపూర్ లో మమతా బెనర్జీకి వోటు వేస్తామన్న పాపానికి కాళ్ళూ చేతులు పోగొట్టుకున్న వారి గురించి జాతీయ మీడియా లో చూశాం.. కానీ ఇప్పుడు బయట పడుతున్న ఈ కంకాళాలు హిట్లర్ కాలం నాటి హోలోకాస్ట్ ను గుర్తుతెస్తున్నాయి.. బహుశా స్వత్రంత భారత చరిత్రలో ఇలా హిట్లర్ వారసులను చూడటం ఇదే ప్రధమం కాబోలు.. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడామని చెప్పుకునే కమ్యూనిష్టులు తమ అధికారం కోసం అదే పంథాను అనుసరించి తామూ ఆ తాను లో ముక్కలమే అని తెలుపుకోవడం కొసమెరుపు.. 

ఇంకా కామెడీ విషయం ఏమిటంటే, ఈ రాక్షస మూకలు బాబా రాం దేవ్ దీక్ష గురించి చులకనగా మాట్లాడటం.. ఈ దివాళాకోరు మేధావులు చేసిన ఏ ఉద్యమానికైనా ఇంత ప్రజామద్దతు లభించిందా?? నా ఇంజినీరింగ్ రోజులలో మా సీనియర్ ఒకతను ఒక మాట చెప్పేవాడు.. ప్రస్తుతం ప్రపంచాన్ని మానవసమాజం మనుగడకు పెను సవాళ్ళుగా ఉన్నవి రెండు:1. ఎయిడ్స్ 2. కమ్యూనిజం
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎందుకో అతని మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి.. ఎన్ని దేశాలను నాశనం చేశారో, ఎన్ని లక్షలమందిని చంపరో.. బహుశా లెక్క కట్టడం సాధ్యం కాకపోవచ్చు..   మనదేశం లాంటి బలమైన ప్రజాస్వామ్య దేశం లోనే వీళ్ళ ఆగడాలు ఇలా ఉంటే ఇక మిగతా దేశాల గురించి ఆలోచించడం అనవ సరం..
-
ఇంద్రకంటి కార్తికేయ