ఏం జరుగుతోంది?

4/15/2008 - రాసింది karthik at Tuesday, April 15, 2008
ప్రసన్న లక్ష్మి- షేక్ సుభాని
శ్రీ లక్ష్మి- మనోహర్
మీనా కుమారి-సందీప్

వీరంతా రాష్ట్రం లొ పెద్ద సంచలనం సృష్టించిన వారు. ఒకరు మరణించి/గాయపడి, మరొకరు దాడి చేసి. ఈ సంఘటనలు జరిగాక అందరూ ఆ పని చేసిన అబ్బాయిలను తిట్టీ, శపించి వారి కోపాన్ని, భాధను వెళ్ళ గక్కారు.
కాని ఈ సంఘటనల తర్వాత మనం(మన సమాజం) ఏదన్నా నేర్చుకున్నమా?
పైన చెప్పిన సంఘటనలు జరిగిన తరువాత పేపర్లలో, టీవిలో, బ్లాగుల్లొ, అమ్మాయిలు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి చెప్పారు. కేవలం జాగ్రత్తలు తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందా? మనం ప్రభుత్వాన్ని తిడతాం, కాని ప్రతి ఒక్క అమ్మాయికి పోలీస్ రక్షణ సాధ్యమేనా?

ఒక ఇంగ్లీష్ సామెత చెప్పినట్టు 'society prepares the crime and the criminal commits it'
ఆ దారుణాలు చేసిన వారు కరడు కట్టిన తీవ్ర వాదులు కారు లేదా ఫైనాన్సె కంపెని పేరుతొ డబ్బు దోచుకున్న వారూ కాదు. వాళ్ళూ మన లాంటి వాళ్ళే. కాస్త సరైన దారిలో చూపించే వారు ఉండి ఉంటే ఏ సాఫ్ట్ వేర్ కంపని లోనో జాబ్ చేస్తు ఉండే వారు.

కాకతాళీయంగా నేనూ కూడా 2001 లో ఇంజినీరింగ్ జాయిన్ అయ్యి తర్వాత ఐ.ఐ.టి లో చదివి ఇప్పుదు నెలకు 5 అంకెల జీతం తీసుకుంతున్నను. మరి అదే ఆశయం తో వున్న సందీప్ ఇప్పుదు రాజమండ్రి సెంట్రల్ జైలు లొ ఉన్నాదు :(
********************************************************************************
నాకు ఆ అమ్మయిల కుటుంబాలను కించపరిచే/బాధ పెట్టే ఉద్దేశ్యం లేదు. వారు చెసిన పనిని సమర్ధించటం లేదు. దయ చేసి అర్ధం చేసుకొగలరు
********************************************************************************
కాని వారు ఎందుకు అలా అయ్యారు? ఈ ప్రశ్నకు సమాధానం లేదు.
స్త్రీలకు 33% రిజర్వేషన్ గురించీ, వాళ్ళ హక్కుల గురించి, ఎక్కువ మట్లాడితె అర్ధనారీస్వర తత్వం గురించి లెక్చర్లు దంచుతాం. కాని మనలో ఎంత మందిమి మనతో పని చేసే మనకు కనిపించే ఆడవారిని 'అదీ 'ఇదీ అని కాకుండా మాములుగా సంభోధిస్తాం?

స్త్రీలను గౌరవించటం అనేది మన ఇంటి నుంచి మొదలు కావాలి. ఆ పరివర్తన వ్యక్తి నుంచి మొదలై సమాజం వరకు రావాలి. అది జరుగనంత వరకు మరెంతొ మంది మీనా కుమారి లను చూడక తప్పదు.

నేను ఒక ఫెమినిస్ట్ ను కాను
బెంగళూరు మహిళా సంఘ కార్యదర్సిని అంతకు ముందే కాను.
ఒక మనిషిని. పదహారణాల తెలుగు బిడ్డను.