నాడు- నేడు

10/01/2007 - రాసింది karthik at Monday, October 01, 2007
పురాణ కాలం:
గొడవ జరిగితే ఒక మంచి ప్రదేశం, ముహూర్తం, చూసుకుని నియమం తప్పకుండా యుద్దం లొ చంపేవారు. ధర్మం నాలుగు పాదాల మీద నడిచేది.
రాజుల కాలం:
యుద్దాలు జరిగేవి ఐనా వేరే మార్గాల్లొ కూడా మనిషిని చంపేవారు. ధర్మం ఎన్ని పాదాల మీద నడిచేదో తెలీదు కాని కనీసం రెండు పాదాలు అని ఒక నమ్మకం.
మహమ్మదీయుల కాలం:
రక రకాల మార్గాల్లొ హత్యలు జరిగేవి. ఐనా అక్బర్, తానిషా లంటి వారు వున్నారు కనుక ఒక పాదం మీద కొన్ని సార్లు రెండిటి మీద ధర్మం నడిచేది.
బ్రిటిష్ కాలం:

దుర్మార్గాలు చాల జరిగేవి. కాని కాటన్, సి.పి. బ్రౌన్ లాంటి వాళ్ళ వల్ల ధర్మం ఒక కాలు తో నడక అలవాటు చేసుకుంది.
ప్రస్తుతం:
ధర్మం ఒక కాలు మాత్రం మిగుల్చుకుంది కానీ దానికి చికెన్ గన్యా జ్వరం వచ్చింది. దాని వల్ల బాంబు తల్లులు, బాంబు తండ్రులు పుట్టుకొచ్చారు. ఇక ఆంధ్ర దేశం లొ మరో కొత్త పద్దతి కని పెట్టడం జరిగింది. అది ఏమనగా మనిషిని ఇంటికి పిలిచి ప్రభుత్వం చే గుర్తింపు పొందిన తుపాకి తో కాల్చటం!!!
ఒక వేళ ఎవరైన అడగటం అంటు జరిగితే అది ఆత్మహత్య అని మౄతునికి భవ సాగర 'బంధాల ' నుంచి విముక్తి కలిగించుటకు తుపాకి ఇవ్వడం జరిగింది అని చెప్పవచ్చు. ఒక వేళ అతను బతికి బట్టకట్ట్డం అంటు జరిగితే అది ఇంటి బయట నుంచి ఎవరో గుర్తు తెలియని వారు కాల్చారని, వారికి కూడా తుపాకి అద్దె కు ఇచ్చాం అని చెప్పవచ్చు.


రాయలసీమ లో చదువు లేని వాళ్ళు ఊరి కోసం, తిండి కోసం చంపుకుంటె ఫ్యాక్షనిజం అని సినిమాలు తీసి పెద్ద పెద్ద సందేశాలు ఇస్తారే, మరి రాజధాని నడిబొడ్డున ఏ.సి. రూముల్లొ వుంటూ, స్కాచ్ తాగుతూ మూఢ నమ్మకాలకోసం, భూమి కోసం అయిన వాళ్ళనే చంపుతుంటె దాన్ని ఏ పేరు తో పిలవాలి? దాని మీద ఎన్ని సినిమాలు తియ్యాలి?