జీవని యాత్ర

6/23/2011 - రాసింది karthik at Thursday, June 23, 2011
మొన్న ఆదివారం జీవనికి వెళ్ళాం కదా.. ఆ రోజు మొత్తం సూపరో సూపరు :)
కడప  నుంచీ అనంతపురం ఫస్ట్ బస్ పొద్దున 5:30 కు అందుకని మా నాన్న 4:30 కు నిద్ర లేపారు.. కానీ ఈ మధ్య బద్దకం బాగా ఎక్కువైంది కదా, ఒక 20నిముషాలు అటు ఇటు చాపమీదనే పొల్లి తర్వాత నిద్రలేచాను.. పరుగెత్తుకుంటూ స్నానం చేసి బస్ స్టండ్ కు వెళ్ళాను అప్పటికి టైం 5:20.. బస్ దొరుకుతుంది లే అనుకున్నాను.. కానీ ఆ బస్ వెళ్ళిపొయి అప్పటికే 5నిమిషాలు దాటిపోయింది.. తర్వాతి బస్ తాడిపత్రి దాకా ఉంది అంటే అదెక్కాను.. ఆ బస్ 8:45 కు తాడిపత్రి దించేశాడు.. చాలాసేపు నిద్రపోవడం వల్ల ప్రయాణం చేసినట్టు అనిపించలేదు.. అక్కడి నుంచీ అనంతపురం వెళ్ళే బస్ లో జరిగింది అసలు కామెడీ.. మన రాజ్ కుమార్ కు ఫోన్ చేస్తే ఇంజినీరింగ్ కాలెజీ దగ్గర దిగేయమని చెప్పాడు.. అక్కడికి తనే వచ్చి పికప్ చేసుకుంటా అని కూడా చెప్పాడు.. నేను కండక్టర్ కు ఆ విషయమే చెప్పి పాటలు వింటూ పడుకున్నాను.. తిఫిన్ తిన్నాక నిద్రపోయాను.. కళ్ళు తెరిచి చూసే సరికి మన బస్ వాడు ఆ కాలేజీ దాటి 10నిమిషాలయ్యింది అని పక్కవాళ్ళు చెప్పారు.. కండక్టర్ దగ్గరకి పొయ్యి అడిగితే, ఆ కాలేజి దగ్గర ఎవరో దిగారు సార్ అది మీరే అనుకున్నా అన్నాడు.. మహానుభావుడిది సొంత ఊరు శ్రీకాకుళమేమో.. ఏం చేద్దాం, వెంటనే బస్ దిగేసి ఆటో కోసం చూశా.. ఒక్క ఆటో కూడా ఖాళీగా రావడం లేదు.. అన్ని ఫుల్లే, బహుశా కాలేజీ వల్ల బిజీ అనుకుంటా.. ఒక 5నిమిషాల తర్వాత ఎవరో బైక్ మీద వస్తుంటే అతన్ని లిఫ్ట్ అడిగి కాలేజీ దగ్గరికి చేరాను. ఇంకొక 5నిమిషాల తర్వాత రాజ్ వచ్చి పికప్ చేసుకున్నాడు..  ఆ శంకుస్థాపన జరిగే చోటికి వెళితే అక్కడ ఆశ్చర్యకరమైన సంఘటనలు చాలా జరిగాయి..ఒంగోల్ శ్రీను అనే వ్యక్తి కనిపించాడు, పక్కన రాజ్ కుమార్ అనే వ్యక్తి కూడా కనిపించాడు. ఒక వ్యక్తి ఒరిజినల్, ఫేక్ ఇద్దరూ ఒకే ఫ్రేం లో ఇద్దరు మనుషులుగా కనిపించడం బహుశా ప్రపంచ ఫేకుల చరిత్ర లో ఇదే ప్రధమం కాబోలు.. ఈ ఒక్క కారణం చాలు ఆ రోజుని ఫాదర్స్ డే కు బదులుగా ఫేకర్స్ డే గా గుర్తించడానికి.. తల తిప్పి చూస్తే బంతి అనే వ్యక్తి కూడా కనిపించాడు.. ఆశ్చర్యం!! నా ఫేక్ ఐడీ నాకు తెలీకుండా ఎలా వచ్చాడా అని కాసేపు విస్తుపోయాను.. ఆ తర్వాత జీవితం అంటే ఇంతే అని లైట్ తీసుకున్నాను.. మాతో పాటూ అక్కడ లీలామోహనం బ్లాగర్ విజయమోహన్ గారూ కూడా వచ్చారు..  రైతునని గర్వంగా చెప్పుకునే వ్యక్తిని కలవడం చాలా సంతోషం కలిగించింది.. We are proud to have met someone like you..

ఆ తర్వాత ప్రోగ్రాం మొదలవకముందు శివకుమార్ మైక్ అందుకొని తన ప్రతిభా ప్రదర్శన మొదలు పెట్టాడు. శివకుమార్ తెలుగు, కన్నడ భాషలలో పాటలు, డయలాగులు,మిమిక్రీ చెయ్యగలడు.. కానీ ఆ రోజు మాత్రం మిమిక్రీ చేశాడు.. మైక్ దొరికింది కదా అని వై.యస్. ను చంద్రబాబును ఫుట్ బాల్ ఆడుకున్నాడు. గెస్ట్లు వచ్చేముందు ఎవరో వెళ్ళి ఇంక చాలు రా బాబు అని మైక్ లాక్కున్నారు.. అప్పటికి గానీ మనవాడు శాంతించలేదు.. :D
ఇక ప్రోగ్రాం మొదలయ్యాక ఎవరూ ఊకదంపుడు లెక్చర్లు ఇచ్చి బుర్ర తినలేదు.. అందరూ క్లుప్తంగా తాము చెప్పాలనుకున్నది చెప్పారు.. ఇందులో నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది ఆకెళ్ళ రాఘవేంద్ర గారు, ఆయన స్టేజ్ మీద ఉండి ప్రతీ వక్తా మాట్లాడిన దానిలో తనకేం గుర్తొచ్చాయి, ఆ విషయాలు ఇక్కడ ఎలా రిలవెంట్ అని వివరిస్తూ చాలా మంచి విషయాలు చెప్పారు.. ప్రసాద్ గారు కేవలం రెండు నిమిషాలలో తను చెప్పాలనుకున్నది చెప్పి ప్రతీ ఒక్కరిని తమ టైం లో డబ్బులో 1% సమాజానికి ఇవ్వమని చెప్పారు.. ఇది నాకు చాలా బాగా నచ్చింది.. తర్వాత ఆలూరు సాంబశివా రెడ్డి గారు మాట్లాడారు. ఈయన యస్.ఆర్.ఐ.టి. కాలేజి కరస్పాండెంట్. నేను మొదట్లో కరస్పాండెంట్ అంటే కనీసం 45 ఏళ్ళు ఉంటాయని అనుకున్నాను.. కానీ చూస్తే నాకంటే చిన్న వ్యక్తి లా కనిపించారు..   ఆయన మాట్లాడుతూ ఇంకొక 2-3 ఏళ్ళల్లో దాతలు ఎవరూ లేకపోయినా కేవలం ఇంజినీరింగ్ కాలేజీ ఫండ్స్ తో జీవనిని నడిపేందుకు తను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.. అంత అవసరం ఎప్పటికీ రాదు.. కానీ నాకు జీవని కి ఆయన కమిట్మెంట్ శ్లాఘనీయం.. ఈయన తమ ఇంజినీరింగ్ కాలేజిలో పదివేల లోపు ఎంసెట్ ర్యాంక్ ఉన్న పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వారి దగ్గర ఫీజ్ తీసుకోమని పొయిన ఏడాది ప్రకటించారు.. ఈ ప్రకటన చూసి నేను ఆ సంస్థకు అభిమానిగా మారాను.. నేను ఇంజినీరింగ్ చదువుతున్న రోజులలో ఫీజు కట్టలేక చదువు మానేసిన వాళ్ళను చూశా కదా, బహుశా అందువల్ల కాబోలు!

ఆ తర్వాత ఫెర్రర్ గారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.. ఆ ప్రసంగం గురించి ఇప్పటికే వీజయమోహన్ గారు, రాజ్ చెప్పారు కద..తర్వాత బ్లాగర్ల ప్రతినిధిగా వికటకవి మైక్ అందుకొని తనదైన శైలిలో జీవని ముందున్న సవాళ్ళ గురించి చెప్పారు.. అంతే కాక పారదర్శకతకు పెద్ద పీట వేయడం వల్ల జీవని మీద బ్లాగర్లకున్న నమ్మకం గురించి చెప్పారు.. ఇదే స్పూర్తితో మనమందరం జీవని టీం కు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ ప్రసంగాలు అవి అయ్యాక మా ముందు వరుసలో కూర్చున్న ఒక ముసలాయన నిదానంగా లేచి నడవడం మొదలు పెట్టాడు.. ఆయనకు 70+ వయసు ఉంటుంది.. కర్ర సాయంతో నడుస్తున్నాడు..  నేను సభ నుంచి వెళ్ళిపోవడానికి లేచాడనుకున్నా.. నిదానంగా వెళ్ళి వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చాడు.. తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు చూస్తే ఆయన జేబు క్రింద ఉన్న చొక్కా అంతా చిరిగిపోయి ఉంది.. నాకు ఎందుకో ఒక్క నిముషం కళ్ళు చెమర్చాయి.. చాలెంజ్ సినిమాలో చూపించిన ఆ ముసలమ్మ గుర్తుకు వచ్చింది.. వెయ్యి రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు కష్టపడాలో!
ఇవన్నీ సరే కానీ మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేశాం.. కొందరు బ్లాగర్లు ఇప్పుడు అంటున్నారు మాకు తెలిసుంటే వచ్చేవాళ్ళం అని.. నిజమే! అందరం కలిస్తేనే సందడిగా బాగుంటుంది.. కుదిరితే ఆగస్ట్ నెలలో ఒక రెండు రోజుల జీవని యాత్ర వెయ్యడం బాగుంటుంది అని నాకనిపిస్తోంది.. అంటే శనివారం పొద్దున అనంతపురం వెళ్ళి ఆ రోజంతా ఉండి ఆదివారం పూర్తిగా పిల్లలతో గడపేటట్టుగా వెళ్ళాలి.. చూద్దాం, ఎంతమందికి ఈ ప్లాన్ నచ్చుతుందో, ఎంతవరకూ వర్క్ అవుట్ అవుతుందో చూడాలి..   

జంధ్యాల గారి గురించి ఆదివిష్ణు గారు రాసిన వ్యాసం..

6/20/2011 - రాసింది karthik at Monday, June 20, 2011
జంధ్యాల గారు-ఆది విష్ణు గారు ఎంత మంచి మిత్రులో మనకు తెలిసిందే.. 2002లో జంధ్యాల గారి మొదటి వర్ధంతి సందర్భంగా ఆది విష్ణు గారు వ్రాసిన వ్యాసం  లోని కొంత భాగం చిత్రమాలికలో ఇక్కడ చూడవచ్చు.. ఈ వ్యాసం 16జూన్-30జూన్,2002 హాసం పత్రికలో ప్రచురితం అయ్యింది..ఈ వ్యాసం  ఒక ప్రముఖుడు మరో ప్రముఖుడి గురించి రాసినట్టుగా కాక కేవలం ఒక మిత్రుడి లేని వెలితి గురించి ఆదివిష్ణు గారు ఎలా రాశారో మనం చూడవచ్చు .. ఈ వ్యాసాన్ని ద్తొమ్మిదేళ్ళపాటూ భద్రపరిచినందుకు నాగురించి నాకే చాలా ఆనందంగా ఉంది..ఈ రోజు చిత్రమాలిక ద్వారా ఆ వ్యాసాన్ని ఆన్లైన్లో పెట్టే అవకాశం కలిగింది..   చిత్రమాలికలో వ్యాసం ఇక్కడ చూడగలరు..

చిత్రమాలికలో బద్రీనాథ్ రివ్యూ..

6/13/2011 - రాసింది karthik at Monday, June 13, 2011
మగధీర లాంటి మెగా హిట్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచీ అలాంటి పెద్ద ఖర్చుతో, వినాయక్ లాంటి కమర్షియల్ డైరెక్టర్ నుంచీ వస్తున్న సినిమా అంటే అంచనాలు చాలా ఎక్కువగా ఉండటం సహజం. అలాంటి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “బద్రీనాథ్”..

పూర్తి  రివ్యూ కోసం ఇక్కడ నొక్కండి..

బులుసేరియా మరియూ దాని పర్యవసానాలు..

6/10/2011 - రాసింది karthik at Friday, June 10, 2011
గత ఏడాది కాలంగా బ్లాగుల్లో బులుసేరియా అనే వ్యాధి బహు వేగంగా వ్యాపిస్తోందని ఇంటెలిజెన్స్ సమాచారం.. ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి??వాటిని మొదట్లోనే తుంచేయడం ఎలా?? అసలు ఈ వ్యాధి కి గల కారణాలు ఏమిటి?? అనే విషయాల పై కొంత తిరిగిశోధన(re-search) చేసి ఈ క్రింది లక్షణాలు కలవారు బులుసేరియా వ్యాధిగ్రస్తులని నిర్ణయించడం జరిగింది..

1. ఏ వాస్తు జ్యోతిష్యాల గురించిన ప్రకటన చూసినా ఈ క్రింది వాక్యం గుర్తొచ్చి నవ్వడం.. 
>>ఆతర్వాత ఎ.సి తీసికెళ్ళి బాత్ రూములో పెట్ట౦డి. బెడ్ రూము ఒక అడుగు లోతు తవ్వి౦చ౦డి. బెడ్ రూములో మీమ౦చ౦ నాలుగు కోళ్ళలో రె౦డు సగానికి విరగ కొట్టి౦చ౦డి.

2. స్కూలుకుపొయ్యే ఏ చంటి పిల్లోడిని చూసినా ఈ క్రింది విషయం గుర్తొచ్చి ఎక్కడ ఉన్నామో కూడా చూసుకోకుండా పగలబడి నవ్వడం.
>>తోడన్ నే తోడలేక ఛస్తుంటే తోకలాగ తోన్ ఏమిటిరా అని ఏడ్చేవాడు మాబండోడు.

3. కాంఫరెన్స్ రూం లో మీటింగ్ ఉన్నప్పుడు బాసు పక్కనే ఉన్నా కూడా ఈ క్రింది వాక్యం గుర్తొచ్చి పళ్ళికిలించడం..
>>బాసింపట్టు వేసుకొని రెండు చేతులు వళ్ళో పెట్టుకొని కళ్ళుమూసుకొని ఘృతాచి మీద మనసు లగ్నం చేసి కూర్చుంటాను.

4.ఏ భార్యా భర్తాలు మాట్లాడుకుంటున్నా ఈ క్రింది విషయాలు గుర్తొచ్చి ముసిముసిగా నవ్వడం.. వాళ్ళు సీరియస్ గా చూస్తే ఏం చెప్పాలో అర్థం కాక తింగరి ఫేస్ పెట్టడం :(
>>ఉద్యమిస్తే పొయేది ఏమీలేదు భార్య తప్ప పద౦డి ము౦దుకు పద౦డి పద౦డి.

5.పార్కుల్లో, మాల్స్ లో ఒక అమ్మాయి &అబ్బాయి కనిపిస్తే ఈ క్రింది వాక్యాలు గుర్తు రావడం.. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలిసే ఉంటుంది..
>>“ఐ యామ్ తెగ లవింగ్ యు డార్జిలింగ్,  సిమ్లా, కులుమనాలి”

6. Appraisal Discussionలో క్రింది పద్యం చెప్పుకోవాలనిపించడం.. అంత సీరియస్ టైం లో నవ్వాపుకోలేకపోవడం
>>లావొక్కింతయు  లేదు, ఎవనిచే  జనించు, కానరార  కైలాస  నివాస, అంటూ పద్యాలు, పాటలు పాడుకుంటున్నాను  లోలోపల.

7. అమ్మా నాన్నలతో ఎప్పుడు మాట్లాడినా ఈ క్రింది వాక్యం గుర్తుకు వచ్చి "హహహ" అని వికట్టాట్టహాసం చెయ్యడం..
>>అయినా ఈ తల్లిదండ్రులకు,  ఇల్లా పిల్లలని ముఖ్యంగా మగపిల్లలని సంసార కూపంలో పడవేసి వాళ్ళు మునగలేక, తేలలేక  హే కృష్ణా, ముకుందా, మురారీ   అని పాడుతుంటే విని ఆనందించాలనే  బలీయమైన కోరిక ఎందుకు కలుగుతుందో నాకు అర్ధం కాదు

8. పెళ్ళిల్లలో నగలు దిగేసుకున్న జనాలను చూసి ఈ క్రింది వాక్యం గుర్తుకురావడం.. నవ్వితే ఏదో ఘోరాం చేసినట్టు వాళ్ళు చూడటం
>>కదిలే మార్వాడీ కొట్టు లాగ అడుగులో అడుగు వేసుకుంటూ, బంగారం వాసన వేస్తూ తిరిగే మహిళా మణుల మధ్య నించి, నన్ను లాక్కేళ్ళి అబ్బాయి దగ్గర దిగపెట్టేడు.

వీటన్నిటినీ మించి నా ఫేవరేట్ టపా మాత్రం ఇదే  "
మీ ఆయన మిమ్మలని ఎంతగా ప్రేమిస్తున్నాడు?" ఇప్పటికి కనీసం 30 సార్లు చదివుంటాను.. :D అసలు మనల్ని ఇంతగా వెంటాడిన బులుసుగారిని కిడ్నాప్ చేస్తే ఎలాఉంటుంది అని ఆలోచించా.. ఏలూరులో ఉన్నానని మాష్టారు చెప్పేశారు కనుక ఇక మిగిలింది సూమోలను దించడమే అనుకున్నా.. కానీ ఆ తర్వాత మోకాల్లో బల్బు వెలిగింది.. తీరా అక్కడికెళ్ళాక ఈయన ఇంకెన్ని విషయాలు చెప్పేస్తారో అసలు కిడ్నాప్ చేసేలోపు మనం నవ్వి నవ్వి సృహ తప్పచ్చేమో అని డౌట్ వచ్చింది.. అందుకని భయపడి ఆ ప్రాజెక్ట్ వదిలేశా.. సీమ లో పుట్టినందుకు ఒక్కటైనా ఫ్యాక్షన్ పని చేద్దామనుకున్నా.. 
చీ! నాకోరిక ఇలా మట్టికొట్టుక్పోయింది :(

కాబట్టి కామ్రెడ్స్ నేను చెప్పేదేమిటంటే బ్లాగుల్లో ప్రస్తుతం ఉన్నవి రెండు వర్గాలు:
1. బులుసేరియా బాధితులు
2. కాదని అబద్దం చెప్పేవాళ్ళు
మీరే వర్గం వారో మీరే తేల్చుకోండి.. నేను మాత్రం మొదటి వర్గం ఒప్పేసుకుంటున్నా!

గమనిక: సెలయేరులా మొదలైన బులుసుగారి నవ్వులప్రవాహం జీవనదిలా మారి మనందరినీ తడిపిముంచెత్తింది.. ఆ హాస్యపు జల్లు మొదలై వచ్చే వారానికి(14 జూన్) ఒక ఏడాది..   ఆ రోజు నాకు పోస్ట్ వెయ్యడం కుదరకపోవచ్చు అందుకని  కూసింత ముందుగానే రాస్తున్నా.. హిహిహి!!




ఆ ముసలోడు చచ్చాడు..

6/09/2011 - రాసింది karthik at Thursday, June 09, 2011
హైందవ ద్వేషమే ఆలంబనగా జీవించిన  ఆ ముసలోడు చచ్చాడు..
సనాతన విశ్వాసాలు ఈ దేశం లో ఎంత హీన స్థితిలో ఉన్నాయో చెప్పిన ఆ ముసలోడు చచ్చడు.. 
దేవతామూర్తుల వలువలూడదీసి నగ్నత్వమే పవిత్రత అని బొంకిన ఆ ముసలోడు చచ్చాడు.. 
మరి అంత పవిత్రమైన నగ్నత్వాన్ని తన మతం వారికి ఆపాదించలేని ఆ ముసలోడు చచ్చాడు..
హిందువుల చేతకానితనానినికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆ ముసలోడు చచ్చాడు..
ఈ కర్మభూమిన హిందువుల ప్రారబ్దం ఏమిటో చాటిచెప్పిన ఆ ముసలోడు చచ్చాడు..
లౌకికత్వం పేరుతో హైందవ ధర్మం పైన జరుగుతున్న దాడికి సాక్షిగా నిలిచిన ఆ ముసలోడు చచ్చాడు..
హైందవ జాతిలోని అనైఖ్యతను సొమ్ము చేసుకున్న ఆ ముసలోడు చచ్చడు..

ఇప్పుడే చూస్తున్నా.. ఆ బూతుబొమ్మల ముసలోడు చచ్చాడంట..  జనాలు తెగ సానుభూతి చూపిస్తుంటే ఊరుకోలేక ఇది రాశా.. 

కమ్యూనిస్టు రక్త చరిత్ర- ఇండియన్ వర్షన్

6/06/2011 - రాసింది karthik at Monday, June 06, 2011
(ఆంధ్రజ్యోతి ఆదివారం పేపర్లో వచ్చిన ఈ కథనం చూడగలరు.. 5వ పేజి క్లిక్ చేసి పీడి ఎఫ్ గా డౌన్లోడ్ చేసుకోగలరు..  )

కమ్యూనిష్టులు చెప్పే సమసమాజ స్థాపన లోని డొల్ల తనాన్ని బయటపెట్టే నిజాలు ఒకటొకటిగా వెలుగు చూస్తున్నాయి.. బెంగాల్ లో 34 ఏళ్ళ పాటూ పాలించాం అని జబ్బలు చరుచుకునే ఈ గోముఖ వ్యాఘ్రాలు అసలు అన్నాళ్ళు తమ అధికారాన్ని నిలుపుకోవడానికి ఏం చేశారో సాక్ష్యాలతో సహా బయటకు వస్తుంటే ఇలాంటి రాక్షస మూక కు ఆధునిక సమాజం లో చోటు ఎలా దక్కింది అని సగటు పౌరుడు ముక్కున వేలేసుకుంటున్నాడు.. మిడ్నాపూర్ లో మమతా బెనర్జీకి వోటు వేస్తామన్న పాపానికి కాళ్ళూ చేతులు పోగొట్టుకున్న వారి గురించి జాతీయ మీడియా లో చూశాం.. కానీ ఇప్పుడు బయట పడుతున్న ఈ కంకాళాలు హిట్లర్ కాలం నాటి హోలోకాస్ట్ ను గుర్తుతెస్తున్నాయి.. బహుశా స్వత్రంత భారత చరిత్రలో ఇలా హిట్లర్ వారసులను చూడటం ఇదే ప్రధమం కాబోలు.. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడామని చెప్పుకునే కమ్యూనిష్టులు తమ అధికారం కోసం అదే పంథాను అనుసరించి తామూ ఆ తాను లో ముక్కలమే అని తెలుపుకోవడం కొసమెరుపు.. 

ఇంకా కామెడీ విషయం ఏమిటంటే, ఈ రాక్షస మూకలు బాబా రాం దేవ్ దీక్ష గురించి చులకనగా మాట్లాడటం.. ఈ దివాళాకోరు మేధావులు చేసిన ఏ ఉద్యమానికైనా ఇంత ప్రజామద్దతు లభించిందా?? నా ఇంజినీరింగ్ రోజులలో మా సీనియర్ ఒకతను ఒక మాట చెప్పేవాడు.. ప్రస్తుతం ప్రపంచాన్ని మానవసమాజం మనుగడకు పెను సవాళ్ళుగా ఉన్నవి రెండు:1. ఎయిడ్స్ 2. కమ్యూనిజం
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎందుకో అతని మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి.. ఎన్ని దేశాలను నాశనం చేశారో, ఎన్ని లక్షలమందిని చంపరో.. బహుశా లెక్క కట్టడం సాధ్యం కాకపోవచ్చు..   మనదేశం లాంటి బలమైన ప్రజాస్వామ్య దేశం లోనే వీళ్ళ ఆగడాలు ఇలా ఉంటే ఇక మిగతా దేశాల గురించి ఆలోచించడం అనవ సరం..
-
ఇంద్రకంటి కార్తికేయ