సమస్యలు: అటూ, ఇటూ ..

7/31/2013 - రాసింది karthik at Wednesday, July 31, 2013
చివరకు కేంద్రం తెలంగాణ ప్రకటించింది. ఇప్పటిదాకా తిట్టుకున్న తిట్లన్నీ మర్చిపొయి ఇప్పుడు అందరం సోదరభావంతో ఉందామని ప్రముఖులంతా ప్రకటనిస్తున్నారు.. సరే, సంతోషం!  నేను ఆ విషయం గురించి ఏమీ చెప్పదలుచుకోలేదు. విభజన కరెక్టా, కాదా అనే చర్చ కూడా ఇప్పుడు అప్రస్తుతం. ఎందుకంటే ప్రజలలో మానసికంగా విభజన జరిగి ఒక ఐదారేళ్ళకు పైగానే అయింది. ఒకరు విగ్రహాలు పగులగొట్టినప్పుడు, కవిత్వం పేరుతో బూతు పురాణాలు ప్రచురించినప్పుడు, మరొకరు ఆత్మాహుతి దళం గా మారుతాం అన్నప్పుడే మానసిక విభజన్ ఏ స్థాయిలోఓ ఉందో చూశాం.. 

ఒక సమైక్యవాదిగా సారీ ఇప్పుడు ఈమాటకు విలువ లేదు కదా, సరే ఒక సీమబిడ్డగా ఈ నిర్ణయం వల్ల మా నాకు కనిపిస్తున్న నష్టాలు:

1. హైదరాబాదు నుంచీ సీమాంధ్ర ప్రాంతాలకు బస్సు చార్జీలు పెరగడం. ఎందుకంటే అంతరాష్ట్రాల మధ్య ఉండే టాక్స్ అదనంగా కట్టాలి. ఇది సీమాంధ్రులకు మాత్రమే నష్టం కాదు. అంతకంటే ఘనుడు ఆచంట మల్లన్న అని ఇరు ప్రాంతాల వారూ మొహమాటం లేకుండా ఈ టాక్స్ వేసుకుంటారు.

2. కరెంట్ కష్టాలు అధికమవడం. సీమాంధ్రులకు సింగరేణి బొగ్గు, సాగర్ నుంచీ కరెంట్ రెండు కష్టమే.. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికే ఇవి సరిపోవడం కష్టం. కాబట్టి ఇక సీమాంధ్రులు ఎంచక్కా కరెంట్ తీగలపై బట్టలారేసుకోవచ్చు.

3. రాయలసీమలో, యస్ నా సీమలో తాగడానికి కూడా నీళ్ళు దొరకవు. కరువుసీమలో పుట్టిన పాపానికి సాగు నీళ్ళ గురించి ఆలోచించడం అత్యాసే కానీ ఇప్పుడు తాగు నీరు కూడా కష్టమే. కడప, అనంతపురం జిల్లాలో అతి త్వరలో ఎడారులుగా మారే అవకాశాలు పుష్కలం.

4. ఉద్యోగాలలో ఇబ్బందులు వస్తాయి అని ఒక వాదన. కానీ ఈరోజులలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేదే చాలా తక్కువ పోను పోను ఇంకా తగ్గిపోతాయి. కాబట్టి ఇది పరిగణలోకి తీసుకోలేము.

ఈ సమస్యలు పక్కన పెడితే ఈ తెలంగాణ ఏర్పాటు వల్ల కనీసం ఈ క్రింద చెప్పిన సమస్యలు తీరినా నేను సంతోషిస్తాను:

1. ఫ్లోరైడ్ సమస్య: మన ప్రభుత్వాల చేతగానితనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఈ సమస్య తీరితే అంతే చాలు.
2. ఐ.ఐ.టి. హైదరాబాద్ అంతర్జాతీయ సాంకేతిక కళశాలగా రూపుదిద్దుకోవాలి.
3. హైదరాబాదులో ఉన్న చిన్న చిన్న పరిశ్రమలకు నిరంతరంగా కరెంట్ ఇచ్చి అవి వేరే రాష్ట్రాలకు పోకుండా చూడాలి.
 
తెలంగాణ ఏర్పాటు వల్ల ఈ మాత్రం మేలు జరిగినా ఉద్యమానికి సార్థకత చేకూరినట్లే..


సర్వేజనా సుఖినోభవంతు
-కార్తీక్


దూసుకొచ్చిన కారు; తల్లీ పిల్లలు దుర్మరణం!

రాసింది karthik at Wednesday, July 31, 2013
న్యూఢిల్లీ, జూలై 30: ఈ రోజు సాయంత్రం ఏడుగంటల ప్రాంతం లో రాజధాని ఢిల్లీ నగరంలో JANPATH10 నంబర్ కల గులాబీ రంగు కారు ఫుట్ పాత్ పైకి దూసుకోపోవడం తో తల్లి, ఆమె పిల్లలు అక్కడిక్కడే అకాల మరణం పొందారు. ఈ దుర్ఘటన పొరపాటున జరిగింది కాదని, యస్.గాంధీ అనే విదేశీ వనిత తన కుమారుడైన రాహువును అందలమెక్కించడానికి చేస్తున్న అనేక ప్రయత్నాలలో ఒకటని అభిజ్ఞ వర్గాల భోగట్టా. ఇంతకు మునుపు ఇదే రాహువు కోసం యస్.గాంధీ బీహారీ చాత్ పూజలు చెయ్యడం, లక్నో కబాబులు తినడం లాంటి ప్రయత్నాలు కూడా చేసింది. అవి రెండూ బెడిసికొట్టడం తో నిస్సహాయురాలైన ఈ మృతురాలిని లక్ష్యం గా చేసుకుని ఈ ఘోరకలికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ఎలాంటి పొరపాట్లు కాకుండా పిగ్విజయ్ సింగ్, గులాం ఆజాద్నహీ అనే డ్రైవర్ల దగ్గర నుంచీ సలహాలు తీస్కున్నట్టు తెలిసింది. 
మృతురాలి స్వస్థలం గోదావరీ, కృష్ణ పరివాహక ప్రాంతమని తన వాళ్ళందరూ అనాథగా వదిలివేయడంతో ఢిల్లీ రోడ్ల మీద బ్రతుకుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. మరణించిన వారి వివరాలు:

పేరు: తెలుగు తల్లి
పిల్లలు: శాంతి, తేజ

మరణించిన వారి ఆత్మలకు పుణ్యలోకాలు కలగాలని కోరుకుందాం!

మరణించిన వారిపై రాసిన పాటను క్రింది వీడియో చూడగలరు:





ఈ విషయం ఈరోజు హిందూ పేపర్లో వచ్చిన ఈ లేఖను ఒకసారి చూద్దాం. 


It looks like political expediency, not development, is behind the formation of a separate Telangana. The Congress is aware that Chief Minister Kiran Kumar Reddy is from Rayalaseema and has never openly backed the demand for Telangana. It is evident that his views were not taken seriously by the party high command which appears to have made up its mind after the BJP’s strident support for the cause.
The Congress will gain nothing from its latest move. It has lost its identity in all three regions of Andhra Pradesh. The party leaders from Telangana cannot hope to perform a magic in the region as the TRS, which has been pursuing the demand since 2001, will gain an upper hand. It may well turn out to be a straight contest between the TRS and the TDP. One thing is certain. Andhra Pradesh is heading for a long phase of uncertainty and violence.
V. Sriharsha,
New Delhi
నిన్ను రక్షించుకోలేకపోయిన దౌర్భాగ్యపు జాతి మాది. క్షమించు తెలుగు తల్లీ, క్షమించు!  

ఆశ్రునయనాలతో
-కార్తీక్

బ్రహ్మశ్రీ చాగంటి వారి వివాదం: నా అనుకోలు

7/21/2013 - రాసింది karthik at Sunday, July 21, 2013