నా తెలుగు బ్లాగు పయనం -2009

12/31/2009 - రాసింది karthik at Thursday, December 31, 2009
నేను నా తెలుగు బ్లాగు మొదలుపెట్టి రెండేళ్ళకు పైగా అయ్యింది. కానీ క్రియాశీలకంగా రాస్తున్నది మాత్రం ఈ సంవత్శరం ఫిబ్రవరి నుంచే.. అప్పటి వరకు నాకు తెలుగు బ్లాగులంటే తోటరాముడు, కూడలి, విహారి లాంటి ఒకటి రెండు బ్లాగులే.. ఏదో టపా శిర్షిక ఆకర్షణీయంగా అనిపిస్తే అవి మాత్రం చూసే వాడిని.. ఈ సంవత్శరం ఇంత సీరియస్ గా తెలుగు బ్లాగు రాయడానికి చాలా పెద్ద కథే ఉంది, అదంతా చెప్పి పాఠకులకు బోర్ కొట్టించడం నాకిష్టం లేదు..
ఇక బ్లాగులు చదువుతున్న కొద్ది, ఫాలో అవుతున్న కొద్దీ చాలా మంది ఆలోచనలు తెలుసుకునే అవకాశం కలిగింది. కొంతమంది రాసినవి చాలా బాగా నచ్చితే కొందరు రాసినవి పరమ చెత్తగా అనిపించాయి.. నాకు గుర్తున్నంతలో నేనెవరి గురించీ చెత్త కామెంట్లు పెట్టలేదు.. ఇక ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే చాలా మందితో నేను కొన్ని విషయాలలో పూర్తిగా ఏకీభవించేవాడిని ఇంకొన్ని విషయాలలో పూర్తిగా విబేదించే వాడిని.. ఇక్కడ నేనర్థం చేసుకున్న జీవిత సత్యం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఎవరూ అన్ని విషయాలలో మనతో ఏకీభవించరు, అన్ని విషయాలలో విబేధించరు.. so treat anyone's ideas as just another opinion and accept it.
ఇక ఈ సంవత్శరం కొందరి బ్లాగులు, వాళ్ళ ఆలోచనలు నన్ను చాలా ప్రభావితుణ్ణి చేశాయి.. అలాంటివాళ్ళలో మొదటి వ్యక్తి మన సాహిత్య అభిమాని బ్లాగు రాసే శివరాం ప్రసాద్ గారు. ఆయన రచనలు చూసినప్పుడల్లా, మా నాన్నకు ఒక బ్లాగు ఒపన్ చేసిచ్చి రాయమంటే ఇలానే రాస్తారేమో అనిపిస్తుంది. చందమామ గురించి కానీయండి లేదా ఆయనిచ్చే సలహాలు కానీయండి అన్నీ అలానే అనిపిస్తాయి may be that generation is like that. అందుకే ఆయన రచనల్లన్నీ 2-3 సార్లు చదువుతాను.. అసలు ఆయన రాసిన about me చదివే ఆయన ఫ్యాన్ అయిపోయాను.. " I am 51 year young..." that alone shows his enthusiasm.. I salute you sir!

తర్వాత చెప్పవలసింది తాడేపల్లి గారి గురించి, కత్తి మహేష్ గారి గురించి.. వీరిద్దరితో నేను చాలా విషయాలలో ఏకీభవిస్తాను, చాలా విషయాలలో విబేదిస్తాను.. కానీ ఒక అభిప్రాయం ఏర్పరచుకునే ముందు వాళ్ళు చేసినంత బ్రెయిన్ స్టార్మింగ్(తెలుగు పదం??) నాకు తెలిసి ఎవరూ చెయ్యరు..వాళ్ళు రాసిన చాలా టపాలలో విషయాలు నాకు ఒక కొత్త దృక్కోణాన్ని చూపాయి.. అంతే కాక వారి మధ్య జరిగే చర్చలు కూడా నాకు బాగా నచ్చేవి ఎక్కడా చెత్త మాటలు చెత్త సంగతులు లేకుండా సాగుతాయి.. కొన్ని సార్లు నేనెవర్ని సమర్ధిస్తున్నానో నాకే అర్థం అయ్యేది కాదు :) :) ఒక కామెంట్ చదివితే ఈయన కరెక్ట్ అనిపిస్తాడు ఇంకోటి చదివితే ఆయన కరెక్ట్ అనిపిస్తాడు.. మధ్యలో నలిగిపోయేవాడిని.. ఆలాంటప్పుడు నేనెందుకు కామెంటలేదు అని ప్రజలడగచ్చు.. ఎందుకంటే "నేను చాలా బిజీ" ఇదే మాటను తెలుగులో ఒళ్ళు బరువు అంటారు.. I carry huge respect to the dedication that you show towards your principles!

ఇక మారుపేర్లతో రాసేవారిలో నాకు బాగా ముఖ్యులు మన చదువరిగారు,అబ్రకదబ్ర గారు.. వాళ్ళిద్దరూ చేసే విశ్లేషణలు కూడా నాకు చాలా బాగా నచ్చుతాయ్.. ఇక కొత్తపాళి గారు రాసే కబుర్లలో నాకు కొంత చలసాని ప్రసాదరావు గారి శైలి కనిపిస్తుంది.. ఈనాడులో ప్రతీ బుధవారం వచ్చే కబుర్లు నేనెప్పుడు మిస్ కాలేదు..
మహిళా బ్లాగర్లలో కవితలు రాసేవాళ్ళందరి బ్లాగులు తప్పకుండా చదువుతాను. ఎందుకంటే నేను కవితలు రాయలేను అందుకని వారు రాసినవన్నా చదివి గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా ఒపయోగపడతాయని ఒక ఆశ :) :) అవే కాక మేధగారి బ్లాగు, లక్ష్మిగారి బ్లాగు తప్పకుండా చదువుతాను.. నేను గుర్తుకు తెచ్చుకుని మరీ నవ్వుకునే తిట్లు కొన్ని ఉన్నాయ్.. వాటిలో లక్ష్మి గారు రాసిన "పాతబస్తీలో పసుపుకుంకుమలు అమ్ముకునే వెధవ" తప్పకుండా ఉంది..

ఇవన్నీ ఒక ఎత్తైతే మార్తాండ ఒక్కడూ ఒక ఎత్తు..మొదట్లో నేను మనోడిని సపోర్ట్ చేసే వాడిని. ఆ జీవి లాజిక్కులు తిక్క తిక్కగానే ఉన్నా ఏదో తను నమ్మినవి చెబుతున్నాడులే అనుకునే వాడిని.. ఎప్పుడైతే మన వాడు సాటి బ్లాగర్ల మీద వ్యక్తిగత దాడి మొదలుపెట్టాడో అప్పుడే గౌరవం కోల్పోయాడు.. ఆ తర్వాత నేను మనోడి కామెంట్లు అవి ఫాలో అయ్యి మనోడిలో ఎంతమంది అపరిచితులు ఉన్నారు అనేది తెలుసుకోగలిగాను.. కానీ జూన్ 26న మనోడు చెప్పిన కామెంట్ చదివాక మనోడి మీద కోపం స్థానం లో జాలి కలిగింది.. ఆ రోజు మనోడు చేసిన కామెంట్ ఏమిటి అనేది నా బ్లాగులో రాయడం నాకిష్టం లేదు.. ఇక మార్తాండతో పాటు మంచి కామెడీ ఇచ్చిన మరో బ్లాగు నా ప్రపంచం బ్లాగు.. ఇన్నయ్య అనే జీవి మీద, జన విజ్ఞాన వేదిక మీద ముందు నాకు అంతో ఇంతో మంచి అభిప్రాయం ఉండేది.. ఆ బ్లాగులు ఆయన రాసిన చౌకబారు కూతలతో ఆ మర్యాద కాస్తా పొయింది.. ఇప్పుడు నాకు ఇన్నయ్యంటే "మార్తాండకు ఎక్కువ మొమైత్ ఖాన్ కు తక్కువ" అంతే! వీళ్ళిద్దరి పైత్యం వల్ల నేను ప్ర.పీ.స.స. సభ్యుణ్ణయ్యాను.. నాకు బ్లాగుల ద్వారా ఏర్పడ్డ మొట్ట మొదటి మిత్రులు ప్ర.పీ.స.స. సభ్యులు.. జో,బంతి,సౌమ్య,నాగ,కల్యాణి, JD,malak,...you guys rock!! మనలందరినీ కలిపిన మొహన్ గారికి ప్రత్యేక నెనర్లు..

బ్లాగుల్లొ అందరూ తమ తృప్తి కోసం రాసుకుంటారు కానీ జీవని గారు మాత్రం తన బ్లాగు ద్వారా మనకు కొంతమందికి సహాయపడే అవకాశం కల్పించారు.. 2009 నాకు ఎక్కువ తృప్తి కలిగించిన విషయం మాత్రం నేను జీవని ద్వారా చేసిన రక్త దానమే!!

ఇక వచ్చే సంవత్శరం నా బ్లాగు లక్ష్యాలు:
1.ప్ర.పీ.స.స. కు ఒక రోజులో 500 కామెంట్లు రావాలి,, 24 గంటలూ ఎవరో ఒకరూ రాస్తూనే ఉండాలి..
2. నేను నవతరంగం, పుస్తకం లలో సమీక్షలు రాయాలి..

నాకు తెలుగు బ్లాగును పరిచయం చేసిన త్రివిక్రం గారికి నెనర్లు చెప్పకుండా ఈ టపా ముగియకూడదు.. thanx a million Trivikram!!

అందరికీ హార్దిక నూతన సంవత్శర శుభాకాంక్షలు

-కార్తీక్


3 ఇడియట్స్!!!

12/26/2009 - రాసింది karthik at Saturday, December 26, 2009
ఈ రోజు మధ్యాహ్నం షోకి ఇనొవేటివ్ మల్టీప్లెక్స్ అనే ఒకానొక చెత్త థియేటర్ లో ఈ సినిమాకు వెళ్ళాను.. ఈ సినిమా చేతన్ భగత్ నవల మీద తీశారు అంటే చూడకూడదనుకున్నాను, ఎందుకంటే అతి చెత్త రచయితలు అనే పోటీ జరిగితే నేను దానికి చేతన్ భగత్ పేరుని నామినేట్ చేస్తా!! ఆ జీవి రాసిన 5 పాయింట్ సంవన్,3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ చదివాను.. ఆ తరువాత ఇంకెప్పుడు అతని రచనలు చదవకూడదని ఫిక్స్ అయిపోయాను..

రచయిత చెత్త అయినా ఆమిర్ ఖాన్ సినిమా, అందులో మున్నాభాయ్ తీసిన డైరెక్టర్, కాబట్టి పర్లేదులే అని వెళ్ళాను...90% సినిమా మాధవన్ నెరేట్ చేస్తాడు.. మాధవన్, ఆమిర్ ఖాన్ తో పాటు శర్మాన్ జోషి కూడా ఉన్నాడు.. నాకు రంగ్ దే బసంతి తరువాత శర్మాన్ జోషీ బాగా నచ్చాడు.. హీరోయిన్ గా కరీనా కపూర్ ఒక ముఖ్యమైన పాత్రలో బొమన్ ఇరానీ ఉన్నారు.. చేతన్ భగత్ నవల నుంచీ పక్కా దింపుడు కాదు కనుక నవల చదివినా కూడా కొత్తగానే అనిపించింది.. 90% సినిమా ఒక ముగ్గురు స్టూడెంట్ల నాలుగేళ్ళ కాలేజీ జీవితమే.. ఇంకా చెప్పాలంటే హాస్టల్ జీవితం.. నవల లో చేతన్ భగత్ IITల మీద ప్రజలకున్న క్రేజును విమర్శించాడు.. సినిమాలో ఆమిర్ ఖాన్ మన మార్కుల వ్యవస్థను విమర్శించాడు.. దర్షిల్ సఫారీ ఆత్మ హత్య చేసుకున్నప్పుడు జరిగే సంభాషణ నాకు బాగా నచ్చింది. "డాక్టర్లు గొంతు మీద ఒత్తిడి వల్ల చనిపోయాడు అన్నారు, కానీ మెదడు మీద పడ్డ ఒత్తిడి గురించి ఏమీ చెప్పలేదు" అంటాడు...how true!! నా రెండేళ్ళ హాస్టల్ జీవితం లో ప్రతీ 2-3 నెలలకు ఒక ఆత్మహత్య చూశాను..(at one point of time i attended a workshop on "how to prevent suicides and find signs of depression in people around us") కనుక ఆ వాక్యం నా మనసుకు బాగా హత్తుకుంది.. మున్నాభాయ్ తరహాలోనే దీనిలో కూడా కామెడికి సెపరేట్ ట్రాక్ అంటూ ఏమీ లేదు కానీ మంచి పంచ్ డయలాగులు ఇంకొంత సిచ్యుయేషనల్ కామెడీ బాగుంది.. ఇంటర్వెల్ బ్రేక్లో వచ్చే ట్విస్ట్ నవల నుంచీ సినిమాను దూరంగా నిలబెడుతుంది.. ఇక సెకండ్ హాఫ్ లో నవల నుంచీ తీసుకున్న కొన్ని సీన్లు ఉన్నాయి కానీ నవలలో లాగా చెత్త రొమాంటిక్ సన్నివేశాలు లేవు.. ఎవరైనా కరీనా కపూర్ హాట్ హాట్ సీన్ల కోసం సీనిమా చూడలనుకుంటే వారికి తీవ్ర నిరాశ తప్పదు.. క్లైమాక్స్ లో ఒక 15-20 నిమిషాలు నాకు సుత్తి కొట్టింది. క్లైమాక్స్ టెన్షన్ క్రియేట్ చేసేదానికి కథాపరంగా వేరే సన్నివేశం చేసుంటే బాగుండేదేమో!! బిల్డింగ్ నుంచీ దూకడం, కొశన్ పేపర్లు కొట్టేయడం నవల నుంచీ తీసుకున్నారు..

ఇక పాత్రల చిత్రీకరణల విషయానికి వస్తే హీరో పాత్రను ఎలివేట్ చేసిన విధానం బాగుంది. ఎక్కడా ఒవర్ చేస్తున్నారు అని అనిపించలేదు.. నవల లో ఉన్న తమిళియన్ పాత్రను చతుర్ రామలింగం గా బాగా అడ్జస్ట్ చేశారు.. అది కూడా కథలో ఇమిడిపోయింది.. చాంధసవాద ప్రిన్సిపల్ గా బొమన్ ఇరానీ పాత్ర సినిమాకే హైలైట్!! అలాంటి వాళ్ళను నా జీవితం లో కూడా చాలామందినే చూశాను.. (అవన్నీ "నా ఇంజినీరింగ్ రోజులు" సీరీస్ లో త్వరలో రాద్దామనుకుంటున్నాను). ఇక కరీన హీరోయిన్ గా కంటే ఒక సపోర్టింగ్ పాత్ర అంటే బాగుంటుందేమో, కానీ హీరో హీరోయిన్ రిలేషన్ బాగా చూపించాడు.. ముగ్గురు ఇడియట్స్ మధ్య జరిగే కొన్ని సంభాషణలు చాలా నచ్చాయి.. All is well ఫిలాసఫీ నాకు బాగా నచ్చింది(ఎందుకంటే అది నా ఫిలాసఫీకి చాలా దగ్గరగా ఉంటుంది కనుక :)) All is well అంటే కష్టాలు మాత్రం తీరవు కానీ వాటి వల్ల వచ్చే ఒత్తిడి మాత్రం రాదు.. ఆడియో కూడా బానే ఉంది.. 2-3 పాటలు నాకు బాగా నచ్చాయి..

ఇక నటీనటుల నటన పరంగా చూస్తే అందరూ బాగా చేశారు.. నాకు బాగా నచ్చిన నాటుడు మాత్రం బొమన్ ఇరానీయే.. పాత్రలో చక్కగా ఇండిపోయాడు.. ఆదివారం మధ్యాహ్నం నా కొడుకు చనిపోతే సోమవారం పొద్దున నేను కాలేజీకి వచ్చాను అని చెప్పే సీన్లో మాంఛి గర్వం చూపాడు.. సెంటిమెంటల్ సీన్లలో ఇడియట్స్ ముగ్గురు బాగాచేశారు. ఇక్కడ ఆ ముగ్గురి ప్రతిభ గురించీ ఎవరికీ అనుమానాలు లేవు, వాళ్ళు కూడా ఆ స్థాయికి తగ్గట్టుగా చేశారు..

అన్నీ బాగా కుదిరినా సినిమా హిట్ అయ్యేది మాత్రం డయలాగుల వల్లే, అందులో నాకెటువంటి డౌటు లేదు.. కొన్ని అంతర్జాలం లో మెయిళ్ళ నుంచీ తీసుకున్నా చాలా మటుకు కొత్త జోక్సే ఉన్నాయి.. మొత్తానికి ఆమిర్ ఖాతాలో మరో హీట్ అనుకోవచ్చు..

-కార్తీక్

పసందైన రాజకీయం..

12/18/2009 - రాసింది karthik at Friday, December 18, 2009
ఇప్పుడు రాష్ట్ర రాజకీయం మంచి రసకందాయం లో పడింది.. ఒక పక్క కే.సీ.ఆర్. లాంటి జిన్నాలు రాష్ట్రాన్ని విడదీయటానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు మరో పక్క తాంబూలాలిచ్చిన కేంద్రం మీరు తన్నుకు చావండి అంటూ చోద్యం చూస్తోంది. కానీ ఓలుమొత్తంగా చూస్తే ఎక్కువ నష్టం కలిగింది మాత్రం కాంగ్రెస్ పార్టీకే.. ఒక వేళ తెలంగాణ ఏర్పడితే(అశుభం ప్రతిహతమౌగాక) ఆ క్రెడిట్ తె.రా.స. కొట్టేస్తుంది. మరో పక్క మిగిలిన ప్రాంతాల్లో రాష్ట్రాన్ని విడదీశారనే అపప్రధను మూట కట్టుకుని దుకాణం మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది.. ఇప్పుడు రోశయ్య ఎన్ని ఏడ్పులు ఏడ్చినా, మన్మోహన్ సింగ్ ఆవేదన వెళ్ళబుచ్చినా ఉపయోగం లేదు... ప్రజల మధ్య ఏర్పడ్డ మానసిక దూరం తగ్గే సూచనలు ఇప్పుడిప్పుడే కనపడటం లేదు.. ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఏమీ చెయ్యకుండా తాత్సారం చూపిస్తోంది అందుకే!! ఎటువంటి పరిస్థితిలో అయినా తన 'వర్గ బలంతో' చక్రం అడ్డువేయగల వై.యస్. ఇప్పుడు లేడు.. జగన్ వర్గాన్ని వరండా బ్యాచిగా తయారుచేసి ఒక బలమైన వర్గాన్ని అధిష్ఠానం దూరం చేసుకుంది..
మరో పక్క తెలుగుదేశం పరిస్థితి ఇంకా కామెడీగా ఉంది!! ప్రజల ఆగ్రహాలతో మైండ్ బ్లాక్ అయ్యిన బాబు నేడో రేపో "నా అంబారీ ఏనుగుని రిక్షాలో తీసుకురండి నేను డాల్ఫిన్ హోటల్లో కాఫీ తాగి కురుక్షేత్ర యుద్దానికి పోవాలి" అనే స్టేజిలో ఉన్నాడు.. తెలంగాణ మీద ఒక కమిటీని వేసి దానిలో అభిప్రాయ భేదాలు వచ్చి దేవెందర్ గౌడ్ లాంటి నేత పార్టీని వదిలి వెళ్ళిపోయినా కూడా ఆ అంశం లోని సంక్లిష్టతను అర్థం చేసుకోకుండా తన "ఏ ఎండకా గొడుగు" పాలసీ ఫాలో అయ్యి ఇప్పుడు సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు.. బాబు విస్వనీయత అసలే అంతంతమాత్రం..ఈ దెబ్బతో బాబుకు శంకర గిరి మాన్యాలు తప్పదనిపిస్తోంది..
ఇక మిగిలింది చిరంజీవి, తన మెగస్టార్ స్టేటస్ ను పణంగా పెట్టి మరీ రాజకీయాలకు వచ్చిన వ్యక్తి.. ఎలాగోల అధికార పీఠానికి కూతవేటు దూరం లో అయినా ఉండాలని చాలా తాపత్రయం... ఈ కక్కూర్తితోనే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుందామని ప్రయత్నించాడు. అదికాస్తా మీడియాలో "జెండా పీకేద్దాం" అని వచ్చేసరికీ గొంతులో పచ్చి వెలక్కాయ పడటంతో ఏడుస్తూ అదే పత్రికలకు ఎక్కాడు.. సామాజిక తెలంగాణ అని కబుర్లు చెప్పి ఇప్పుడు అకస్మాత్తుగా నిర్ణయాన్ని మార్చుకున్నాడు.. ఇది ఆలోచించాల్సిన విషయం!! నేను దీని గురించి ఆలోచించగా చించగా కొంత చినిగాక బల్బు వెలిగింది. రాష్ట్రం ఈ రోజు కాకపొయినా ఒక 4-5 ఏళ్ళల్లో అయినా విడిపోక తప్పదు.. అప్పుడు కోస్తాలో కాంగ్రెస్ దూకాణం మూసేసే పరిస్థితిలో ఉంటుంది.. పైగా అది తనకు కొద్దో గొప్పో పట్టున్న ప్రాంతం కనుక అందరికంటే ముందుగా సమైఖ్యాంధ్రకు జై అంటే తెలుగుదేశం కు చెక్ పెట్టచ్చు అనేది ఒక లెక్క!!
ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే జగన్ అకస్మాత్తుగా జై సమైఖ్యాంధ్ర అని ఎందుకన్నాడు?? దీన్ని అడ్డం పెట్టుకుని మేడం కు కడప స్టైల్లో రిప్లై ఇస్తున్నాడా?? (మాదీ కడపే, మేము కొట్టడం అంటు జరిగితే ఇక దెబ్బ తిన్న వాడు మళ్ళీ లేయడు.ఎంతైనా ఉడుకు రక్తం కదా :) :) ) ఇప్పుడు కాంగ్రెస్ నుంచీ జగన్,లగడపాటి అధికార కేంద్రాలుగా తాయారౌతే రాజకీయం బాగుంటుంది.. ఎందుకంటే ఇప్పటిదాకా లగడపాటి వై.యస్. వర్గానికి చెందిన వాడు. ఇక నుంచీ కూడా అలానే ఉంటాడా అనేది ఆలోచించాల్సిన విషయం..ఎందుకంటే ఎక్కడైనా బావే కానీ వంగ తోట దగ్గర మాత్రం కాదు..
ఈ మొత్తం గొడవల్ల ఒక విషయం మాత్రం విస్పష్టంగా తెలిసొచ్చింది.. అదే మన దేశం లో ప్రజలకు, రాజకీయ పార్టిలకు ఉన్న దూరం.. ఒక కమిటీ వేసి కూడా బాబు సమైఖ్యాంధ్ర గురించి తెలుసుకోలేక పోయాడంటే అంతకంటే కామెడీ లేనే లేదు.. ప్రస్తుత పరిస్థితిలో చూశ్తే చిరంజీవికి అందరికంటే ఎక్కువ లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి..

ఎర్ర బస్సు స్వగతం

12/13/2009 - రాసింది karthik at Sunday, December 13, 2009
నా అసలు పేరేమిటొ నేను మరిచిపోయి చాలా కాలమైంది. అందరూ నన్ను, నా జాతి వారినీ ఎర్రబస్సులనే పిలుస్తారు. మొదట మా జాతిలో 27 మంది మాత్రమే ఉండే వాళ్ళు తర్వాత భారత స్వాత్యంత్రం వచ్చాక మాజాతివారు దిన దిన ప్రవర్ధమానంగా పెరిగి ప్రస్తుతం 21 వేలమంది 7 రాష్ట్రాలలో తిరుగుతూ ఉన్నారు.. రోజు దాదాపుగా ఒకటిన్నరకోటిమంది మా జాతివారితో కలిసి తిరుగుతూ ఉంటారు. అందుకేనంట.. గిన్నేసో, గంగాళేసో రికార్డ్ మా పేరు మీదే రాశారంట.. ప్రపంచంలో ఉన్న అన్ని బస్సు జాతులలో మేము తిప్పేంతమందిని ఎవరూ తిప్పరట.. 1990ల వరకూ ఒకవెలుగు వెలిగాము.. ఒకానొక కాలంలో మా సంరక్షకులుగా పని చెయ్యటం అనేది ఒక సామాజిక హోదాలా ఉండేది.. ఆంధ్ర జ్యోతి అనే పుస్తకంలో మా సంరక్షకుల మీద చాలానే చణుకులు పేలేవి.. కానీ అదంతా గతం...
ఆ తర్వాత కొంత మా సంరక్షకుల నిర్లక్ష్యం వల్ల, ఇంకొంత రాజకీయ నాయకుల స్వార్థం వల్ల, మరికొంత సాంకేతిక విప్లవాల వల్లా ప్రస్తుతం మాజాతి అంతరించిపోయే ప్రమాదంలో పడింది. గత దశాబ్దకాలంగా మా సంరక్షకులకు తెలివొచ్చి మమ్మల్ని కాపాడుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. కానీ కొందరు పాలకులు ప్రపంచ బ్యాంకో లేక విశ్వవ్యాప్త బ్యాంకో ఇచ్చే రుణాల మీద ఆశతో మమ్మల్ని అమ్మేస్తామని మాటిచ్చారాట.. ఇవన్నీ కాక పాలకుల చిన్న చూపు వల్ల సమాజంలో పంచింగ్ బ్యాగ్స్ లాగా తయారయ్యాము. ఎవరికి ఎవరిమీద కోపం వచ్చినా నష్టం మాత్రం మాజాతికే..

ఒక నాయకుడు మరణించినా.. అన్నలకు ఖాకీలమీద కోపం వచ్చినా..స్టుడెంట్లకు క్లాసులు ఎగరగొట్టాలనిపించినా.. ఇలా చెప్పుకుంటుపోతే రాష్ట్రంలో ఎక్కడ చిన్న అలజడి జరిగినా మరణించేది మాత్రం మేమే. పరిస్థితి ఇలానే సాగితే ఐక్య రాజ్య సమితి వాళ్ళు ప్రకటించే "అంతరించిపోయే జాతుల" అనే జాబితాలో మమ్మల్ని కూడా చేర్చాలేమో!! మా తాతలు తండ్రుల కాలంలో ఎంతో హుందాగా గర్వంగా బ్రతికిన మేము ఇప్పుడు రోడ్ల మీద దిక్కులేని చావు చావాల్సి వస్తోంది.. ఇంతా చేస్తే సగటు మనిషికి మా అవసరం చాలా ఎక్కువ. మాకు ప్రత్యామ్నాయం కానీ లేక మరొకటి కానీ కల్పించే పరిస్థితిలో ఇప్పటి ప్రభుత్వాలు లేవు..భారత రైల్వేతో సమానంగా భారం మోయగల సత్తా మాకుంది.. (ఆధారం: వీకీపీడియా) ఇక ఇప్పటికీ చాలా గ్రామాలకు మేము తప్పే వేరే రవాణా సాధనాం లేనే లేదు.. ఐనా ఈ పంచింగ్ బ్యాగ్ సంస్కృతి తెలుగు జాతి నరనరాల్లోకి ఎక్కింది. దానిని నిలువరించడానికి ప్రభుత్వ సాయం చాలా అవసరం కానీ ప్రభుత్వం ఎవరి మీద కేసుపెడితే ఎక్కడ ఓట్లు పోతాయో అని మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు.. మా పరిస్థితిలాగే మా సంరక్షకుల వెతలు కూడా చాలానే పెరిగాయి.. బోనస్సులు తీసుకునే రోజుల నుంచీ ఓవర్ టైములు చేసుకునే స్థితికి వచ్చారు. పెన్షన్లు గట్ర ఎలాగూ ఉండవు కనుక పని చేసే రోజులలోనే నాలగు రాళ్ళు వెనక వేసుకోవాలి అని తాపత్రయపడుతూ రకరకాల స్కీములతో సంపాదన కోసం వెంపర్లాడుతూ ప్రజాసేవ అనేది క్రమంగా గాలికి వదిలేస్తున్నారు..మర్యాద వారోత్సవాలు, అమర్యాద సంవత్సరీకాలు చేసుకుంటున్నారు తప్పించి ప్రజలకు ఎలా దగ్గర కావాలి అనేదాని మీద శ్రద్ధ కనిపించదు. సమ్మెలు చేయటంలో ఉన్న నిజాయితీ ప్రజల మీద అభిమానంగా మార్చితే అదే చరిత్రలో అతి పెద్ద మార్కెటింగ్ స్కీము.. 2001 లో మా వాళ్ళు చేసిన సమ్మె గురించి తప్పకుండ చెప్పుకోవాల్సిందే.. ఎందుకంటే అది కార్మిక చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం.. ఆ సమ్మె 24 రోజులు జరిగింది చాలా మంది కార్మికులకు 325 రూపాయలు నెల జీతంగా వచ్చింది. అయినా అన్నీ ఓర్చుకున్నారు... కడకు విజయం సాధించారు.. ప్రస్తుతం కూడా నష్టాలలో కార్మికులు పస్తులతో మేమూ బ్రతుకుతున్నాం..ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తే మాకు ఈ ఆకలి చావులు తప్పవు కానీ ప్రభుత్వం ఇవ్వదు కదా!!
మరెన్ని రోజులు ఇలా అందరితో మాట్లాడుతూ చలాకీగా తిరుగుతుంటామో తెలీదు..ఒకవేళ మేము అంతరించిపోవటం అంటు జరిగితే మీ పిల్లలకు మా గురించీ కథలుగా చెబుతారు కదూ!!

రైట్ రైట్ !


-కార్తీక్

మా నాన్న గారు గత 35 సంవత్సరములుగా RTCలో పని చేస్తున్నారు..కాబట్టి నాకు సగటు RTC ఉద్యోగి జీవితం ఎలా ఉంటుంది అనేది బాగా తెలుసు..అందుకే నేను మాత్రం ఆంధ్రాలో ఎక్కడికిపోవాలన్నా RTC బస్సులోనే పోతాను..

"THE WHEEL STANDS FOR COMMON ZEAL"

తెలంగాణ: నా అనుకోలు!

12/10/2009 - రాసింది karthik at Thursday, December 10, 2009
నా తెలుగు బ్లాగులో సీరియస్ టపాలు రాయకూడదు అని నేను ఫిక్స్ అయ్యి చాలా కాలమయ్యింది.. కాని ఇప్పుడు రాయాల్సి వస్తోంది..కారణం "తెలంగాణ" ఈ టపాలో నేను తెలంగాణా చరిత్ర,మొదటి రాష్ట్రాల పునర్విభజన కమీషన్, నెహ్రూ ఇలాంటి విషయాల జోలికి పోదలుచుకోలేదు.. ఈ అంశం గురించీ నా ఆలోచనలను బ్లాగీకరించే ప్రయత్నమే ఈ టపా.

రాష్ట్రం విడిపోతే తెలంగాణా బాగుపడుతుంది అనేది తెలంగాణా వాదుల మౌలికమైన ఉద్దేశ్యం (basic idea), దానికి వారు హిమాచల్ వగైరా రాష్ట్రాలని ఉదాహరణాలుగా చూపిస్తారు. బాగుపడే అవకాశం ఎంతుందో మరొక దోపిడీ మొదలయ్యే అవకాశం కూడా అంతే ఉంది. చిన్న రాష్ట్రమైన హిమాచల్ బాగుపడితే బీహార్ నుంచీ విడిపొయిన జార్ఖండ్ పాతాళానికి పరుగులు పెడుతూ ఉంది. రేపు తెలంగాణా నేతలు మరొక మధు ఖోడాలుగా తయారు కారని నమ్మకం ఏమిటి?? కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే అభివృద్ది అనేది నేతల మీద ఆధారపడి ఉంది తప్ప రాష్ట్రం యొక్క పరిణామం మీద కాదు.
ఇక ఇప్పటివరకూ ఏ తెలంగాణా వాది నుంచీ విడిపోవడానికి convincing reason వినలేదు. ఇక్కడ అత్యంత దురదృష్టకర పరిణామం ఏమిటంటే తెలంగాణా పేరు మీదా ఆంధ్రా వాళ్ళ మీద విషం కక్కడం. మేము తిట్టేది కేవలం రియల్ ఎస్టేట్లలో సంపాదించిన వాళ్ళను మాత్రమే అంటారు మరి ఆంధ్రా బ్యాంకు పేరు మార్చడం, ఆంధ్రా మీల్స్ అన్న బోర్డ్ కొట్టేయడం ఇవి దేన్ని సూచిస్తున్నాయి. మేము తిట్టేది బడా బాబులనే అని నాయకులు చెప్పొచ్చు కాని కాలిన కడుపులతో ఉన్న వారికి అంత విచక్షణ ఉంటుందా??? వాడికి ఆంధ్రా అన్న పదమే ఒక బూతైపోయింది. శరత్ గారు అన్నట్టు తెలబాన్లు అనే పదమే కరెక్టేనేమో!
ఇక హైదరాబాదు అనేది అత్యంత పెద్ద పీటముడి. అప్పుడింకెంత గొడవలు జరుగుతాయో! ఏమో? హైదరాబాదులో వీధి పోరాటాలు జరిగినా నేను ఆశ్చర్యపోను. దీన్ని ఎలా పరిష్కరిస్తారు??
రాష్ట్ర విభజన అనేది ఒక administrative process జరగాల్సింది ఒక sentimental injury అయ్యింది. అన్నిటికంటే పెద్ద సమస్య అది. ఇప్పుడు ఈ విషం కక్కే చేష్టల వల్ల ఇండియా-పాకిస్తాన్ వాతావరణం ఏర్పడుతుందేమోనని భయంగా ఉంది. ఎందుకంటే తెలంగాణా ఏర్పడ్డా లేకపొయినా నాకొచ్చే జీతం లో తేడా ఏమీరాదు. కానీ మనసులో ఎందుకో తెలియని బాధగా ఉంది.
నా పాయింట్ ఒక్కటె దేశన్ని ప్రాంతలకు అతీతంగ, పార్టీలకు అతీతంగ అందరూ దొచుకున్నారు. వాళ్ళకి తెలంగాణా ఐన, రాయలసీమ ఐన పెద్ద తేడా లేదు. సొ కనీసం మన తరమైనా అభివృద్ధి గురించి ఆలోచించాలి. ఒకరిని ఒకరు తిట్టుకుంటే ప్రయోజనం శూన్యం

చైనా వాడు మన దేశాన్ని 32 భాగాలుగా చేస్తే తన మార్కేట్కు పోటీగా రాకుండా ఉంటామని ప్లాన్ చేశాడట. (4 ఏళ్ళ క్రితం ఏదో పుస్తకం లో చదివాను). ఇక పాకిస్తాన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. తాలిబన్లు మన మీద షరియా విధించటానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టారు. ఇంత మంది ఇన్ని రకాలుగా మనమీద కత్తిగట్టి ఉంటే మన్మేమో కొత్త రాష్ట్రాలు తొక్క తోలు అని కొట్టుకుంటున్నాం!!
ఈ తప్పుకు చరిత్ర మనల్ని క్షమిస్తుందా??? i have no answer..


ఏది ఏమైనా తెలంగాణా రావటం ఫిక్స్ అయ్యింది కనుక ఆ ప్రాంత ప్రజలకు నా హార్దిక శుభాకాంక్షలు. ఇప్పటి వరకూ జరిగిన విష ప్రచారం ఇకనైనా ఆపాలని మనవి.

చివరగా:
మాతెలుగుతల్లికి క్షమాపణల దండ

మా కన్నతల్లికి పాదాభివందనములు

కడుపులో కత్తెర్లు
కనుపాపలో నెత్తుర్లు
చీదరింపుల చీకట్లు
ప్రసరించెను మాతల్లి

గణగణ తెలంగాణ కదలిపోతుంటేను
బిరబిర హైదరాబాద్ వీడిపోతుంటేను

కంగారు క్షణాలే దొర్లుతాయి
ముత్యాలమురిపాలు మోడులాయే

క్షమించు తెలుగు తల్లీ !

క్షమించు తెలుగు తల్లీ!

పాటకు కాపీరైట్ హక్కుదారు: ప్ర.పీ.స.స.

ఆశ్రునయనాలతో
-కార్తీక్


గమనిక:
కామెంట్లు రాసే ప్రజలు విషం కక్కే మాటలు రాస్తే నేను ఆమోదించను, నా బ్లాగుకి నేనే మోనార్కుని!