బ్లాగర్లు!! అందుకోండి నెనర్లు!!

12/07/2011 - రాసింది karthik at Wednesday, December 07, 2011
నవంబర్ 12, 2011

ఉదయం 9:30,
రాజ్ కుమార్ కి ఫోన్ చేశాను.. ఎందుకో మరి ఫోన్ ఎత్తలేదు..  హైదరాబాద్ నుంచీ ఒక బ్యాచ్, బెంగళూరు నుంచీ ఒక బ్యాచ్ వస్తున్నారు.. అందులో చాలామంది సీమ సందుల్లోకి మొదటి సారి వస్తున్నారు..  ఎక్కడున్నారో ఏమో అని టెన్షన్!!  అసలే ఈ సారి అక్టోబర్ లో కూడా ఎండలుగా ఉన్నాయి,  వీళ్ళకు ఎలా ఉందో ఎమో..

హైదరాబాద్ బ్యాచ్ పరిస్థితి ఏంటో కనుక్కుందామని రెహ్మాన్ కు ఫోన్ చేశాను.. రెహ్మాన్ ఏదో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు.. ప్రతీ మాటకు పక్కన కౌంటర్ పడుతూ ఉంది.. ఒక నిమిషం తర్వాత నేను మాట్లడలేను బాబూ అని ఫోన్ పెట్టేశాడు.. సో బానే ఎంజాయ్ చేస్తున్నారు, పర్లేదు అనుకున్నాను..

మధ్యాహ్నం 12:40,
మళ్ళీ రాజ్ కే ఫోన్ చేశాను..  ఒక లేడీ వాయిస్ మా సీమ యాసలో జవాబిచ్చింది.. నేను ఆ గొంతు ఎవరిదో కనుక్కున్నాను.. సొ అందరూ కలిశారు ఎంజాయ్ చేస్తున్నారు అని ఊపిరి పీల్చుకున్నాను.. తర్వాత ఒక గంట సేపు ఇంట్లో పనులలో బిజీగా ఉండటం వల్ల ఎవరికీ ఫోన్లు చెయ్యలేదు స్టేటస్ అడగలేదు..

మధ్యాహ్నం 3:15,

ఈసారి మళ్ళీ రహ్మాన్ కు ఫోన్ చేశాను..  టిపికల్ రెహ్మాన్ స్టైల్ లో "బస్సులో కాక బండి తీసుకుని వస్తున్నామండి" అని జవాబిచ్చాడు.. హమ్మయ్య అని కుదుటపడ్డాను.. ఎందుకంటే అనంతపురం నుంచీ పులివెందులకు 3గం. ప్రయాణం అని ఎవరో చెప్పారు.. మూడు గంటలు ఆ డొక్కు బస్సులో జర్నీ చేస్తే వీళ్ళ పరిస్థితి స్త్రీవాద కథ లో హీరోలా తయారౌతుంది..

పులివెందుల పేరు విని వీళ్ళు కూడా "ఓదార్పు యాత్ర" సభ్యులనుకోకండి.. వేదమంత్రాల నడుమ అగ్నిహోత్రుని సాక్షిగా నవంబర్ 13, 2011 నాడు నా పెళ్ళి జరిగింది..  ఆ పెళ్ళికని మన బ్లాగర్లందరూ పులివెందులకు వచ్చారు.. డైరెక్ట్ గా పులివెందులకు ట్రైన్ సదుపాయం లేదు కనుక రెండు బ్యాచులు అనంతపురం లో కలిసి కొంతసేపు జీవని పిల్లలతో ఉండి తర్వాత పులివెందులకు వచ్చారు.. బ్లాగర్లంతా సందడి సందడిగా అల్లరి చేశారు.. నేను పిటల మీద నుండి మధ్య మధ్యలో వీళ్ళని చూస్తున్నాను.. ఎందుకంటే వీళ్ళకు ఆ మొత్తం గుంపులో నేను తప్ప ఇంకెవరూ తెలీదు.. నేనేమో మాట్లాడలేను.. వీళ్ళకు బోర్ కొడుతుందేమో అని కొంచెం ఫీలింగ్.. కానీ బ్లాగర్లా మజాకా.. అందరూ దుమ్ము లేపారు..ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడి కడప.. ఎక్కడ నా సోది, ఎక్కడ వాళ్ళ కవితలు, పాటలు.. కొందరు జిల్లాలు దాటి వచ్చారు.. కొందరు రాష్ట్రాలు దాటి వచ్చారు.. అందరికీ పేరు పేరునా కృతజ్ఞతాంజలి..  ఫ్రెండ్షిప్ కు విలువ ఇచ్చి ఇంత దూరం వచ్చారని మా అమ్మా వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు.. చాలామంది మెయిల్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.. అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.. 

మన వాళ్ళిచ్చిన గ్రీటింగ్ కార్డ్.. ఎంత నచ్చిందో..
పెళ్ళికి వచ్చిన బ్లాగర్లు:
1. భజ్ కుమార్
2. సెగట్రీ
3.  మజ్జిగ చిలికే
4. వెంకట్ గారు
5. తీగ ప్రసాద్
6.  గిన్నెల గరన్
7.  కింకర్. తుస్
8. బంతి గారు ( మా అధ్యక్షులు)
9. అల్లాఉద్దీన్ మిల్క్ షేక్
10. డ్రాగార్జున
11.  జీవని ప్రసాద్ గారూ
12. చిలమకూరు విజయమోహన్ గారు





వస్తామని అనుకుని ఆఖరి నిముషం లో రాలేకపొయిన వాళ్ళు:
1. పప్పు సార్
2. బులుసు గారు
3. కౌటిల్య
4. ఆర్కె
5. ఆండి
6. పవన్ 
7. విజయక్రాంతి (ఈయన ఇప్పుడు నాకు బంధువు అవడం వల్ల వాళ్ళ అమ్మ గారు వచ్చారు)  
8. పెళ్ళికి కొన్ని రోజుల ముందు ఇండియాకు వచ్చిన మంచు గారు ఆ లోపే మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు.  ఆయనకూడా వచ్చుంటే ఇంకెంత సందడిగా ఉండేదో!!! 
9. ఏకలింగం గారు కూడా ఇండిఆ కు వస్తే పెళ్ళి అటెండ్ అవుతానని చెప్పారు.. కానీ ఆయన ప్లాన్ తర్వాత మారింది..

I very much missed all of you.. your presence means a lot to me..

బులుసు గారు వస్తే కనుక ఆయన్ని ఎలాగోలా మేనేజ్ చేసి ఘృతాచి చేత గానా బజానా ఏర్పాటు చేయించాలని మన కుర్రోళ్ళు ప్లాన్ చేశారట.. అది తెలిసే ఆయన రాలేదు అని బయట టాక్..  ఎంత వరకూ నిజమో నాకైతే తెలీదు.. ఆ స్కాం తో నాకేం సంభంధం లేదు..

వీళ్ళే కాక, వై.యస్. వివేకానంద రెడ్డి, ఒంగోల్ శీను, వై.యస్. భాస్కర్ రెడ్డి లాంటి ప్రముఖులు కూడా నా పెళ్ళి వచ్చి నన్ను ఆశీర్వదించారు..  కెబ్లాస నుంచీ ఎవరూ రాలేదు.. మరే! ఒంగోల్ శీను ఇప్పుడు బ్లాగర్ స్థాయి నుంచీ ప్రముఖుడి స్థాయికి చేరుకున్నాడు.. :D

-- కార్తీక్