Showing posts with label సీరియస్. Show all posts
Showing posts with label సీరియస్. Show all posts

బ్రహ్మశ్రీ చాగంటి వారి వివాదం: నా అనుకోలు

7/21/2013 - రాసింది karthik at Sunday, July 21, 2013

బ్లాగరుడ పురాణం -1

1/08/2012 - రాసింది karthik at Sunday, January 08, 2012
కొత్త బ్లాగు లోకం లోకి వచ్చిన వాళ్ళకు ఇక్కడ జరిగే గొడవల గురించి ముఖ్యంగా ఓకానొక విదేశీ భావజాలం గొప్పదని జనాల మీద దాడులు చేసే వాళ్ళ గురించి హెచ్చరించడానికి ఇది "రెకనార్"
ముందుగా డైరెక్టుగా విషయం లోకి పోకుండా ప్రస్తుతం మలక్ మీద జరుగుతున్న దుష్ప్రచారం గురించి కొన్ని విషయాలు చెప్పాలి:
 అక్కడ విశేఖర్ గారు తాను మార్తాండని సమర్థిస్తున్నానని అందుకు కారణం మలక్ మార్తాండ ను నా ప్రపంచం బ్లాగులో "ఒరేయ్" అని అన్నాడని సెలవిచ్చారు..  అది జరిగిన లింక్ అని ఆయన "నా ప్రపంచం" బ్లాగు లింక్ ఇచ్చారు ఆ లింక్ ఇది: (http://naprapamcham.blogspot.com/2009/09/blog-post_26.html)
ఆ టపా రాసింది సెప్టెంబర్ 26, 2009 లో... మరి ఒకసారి ఈ లింక్ చూడండి (http://naprapamcham.blogspot.com/2009/09/blog-post_10.html) అదే బ్లాగులో అంతకంటే పది హేను రోజుల ముందు జరిగింది.. అక్కడ సదరు మార్తాండ మలక్ ని అన్నది ఇది:
" PKMCT said...
    భరద్వాజ మహర్షి గెడ్డం తీసేసి సంసార జీవితంలోకి వచ్చినట్టు ఉన్నాడు. అందుకేనేమో సమాధానం చెప్పడం లేదు."

గడ్డం తీసేసి సంసార జీవితం లోకి వచ్చినట్టున్నాడు అని ఏ హక్కు తో అంటాడు? ఏ సభ్యత తో అంటాడు? (hehe ఆయన పదాలే,  టి.వీ. సిరీయల్ లో డయలాగుల్లా ఉంటే ఎంకరేజ్ చేసినట్టుంటుంది అని వాడుకున్నా :))
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మలక్ కామెంట్ పెట్టింది మంచు గారికి కానీ మార్తాండ గురించి కాదు.. అలాంటప్పుడు ఆయనను కెలకాల్సిన అవసరం మార్తాండకు ఎందుకు??? మార్తాండ విశేఖర్ గారు చెబుతున్నంత అమాయకుడైతే తన భావాలేవో రాసుకుని వెళ్ళచ్చు  కదా.. ప్రక్కవాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకంత జిలానందం??? వల్చర్ థౌజండ్ బఫెలోస్, వన్ సైక్లోన్ స్మాష్ అన్నట్టు, మార్తాండకు మలక్ తగిలాడు.. and the rest, as you see is history :))

actually జూలై 17, 2009 రోజు మలక్ ఈ టపా రాశారు (http://malakpetrowdy.blogspot.com/2009/07/blog-post_17.html) .. మలక్-ఏకలింగం ఒకరే అని మార్తాండ చేసిన ప్రేలాపనకు రుజువు చూపమని చేసిన చాలెంజ్ అది.. దానికి ఇప్పటి దాకా మార్తాండ నుంచీ సమాధానం రాలేదు.. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు.. మలక్-ఏకలింగం ఒకరే అని ప్రూవ్ చేస్తే మలక్ ఆ చాలెంజ్ కి తప్పకుండా కట్టుబడి ఉంటారు..  :P
మధ్యలో మార్తాండ నాదెండ్ల కామెడీ చేశాడు.. ఆ లింక్ ఇక్కడ చూడండి : http://malakpetrowdy.blogspot.com/2009/07/blog-post_6509.html
 
ఇక  విశేఖర్ గారు ప్రవీణ్ పై దాడి మొదలైనప్పుడు అని రాసి మార్తాండకు సింపతీ పెంచాలని చాలానే ప్రయత్నించారు.. కానీ infront crocodile festival..ఒకసారి ఈ క్రింద స్క్రీన్ షాట్లు చూడండి.. ఈ కామెంట్లన్నీ మా శ్రేయోభిలాషి అయిన ఒక మహిళ బ్లాగులో సదరు ప్రవీణ్ అనే శాల్తీ రకరకాల పేర్లతో ఆమెను తిడుతూ రాసినవి... దానికి ఆమె బాధ పడుతూ వేరేటపా కూడా పేట్టారు.. మరి ఇక్కడ దాడి చేసింది ఎవరు??  ఆవిడంతకు ఆవిడ ఏదో కథ గురిచి రాసుకుంటే వ్యక్తిగత దాడులు చెయ్యాల్సిన అవసరం ప్రవీణ్ కు ఎందుకు??  ఆయన చెప్పినట్టు మనసు బాధపడటానికి ఒక్క వ్యాఖ్య చాలదా?? ఈ మాట ప్రవీణ్ కు ఎందుకు చెప్పరో అర్థం ఆయనకే తెలియాలి..


విశేఖర్ గారు చెప్పిన మరొక విషయం  భావజాలానికి ప్రతినిధి.. 
కిం.ప.దొ.న. :))
మార్తాండ ఏ భావజాలానికి ప్రతినిధి?? స్త్రీవాదానికా?? మహిళా బ్లాగర్లలో ఎంతమంది స్త్రీవాదులున్నారో తెలుసా?? మరి వాళ్ళను ఎవరూ ఏమీ అనరు ఎందుకో.. లేక నాస్తిక వాదానికా?? మరి శరత్ గారు కూడా నాస్తికులే, కానీ మా శ్రేయోభిలాషి... ఆయన ఎప్పుడు ఇంకొకరి కుటుంబాలను అన్నట్టు చూడలేదు..

అయితే గీతే, మార్తాండ తప్పకుండా కమ్యునిజానికి ప్రతినిధి అయ్యుంటాడు.. ఎందుకంటే, ఈ కమ్యునిజం సిద్దాంతం ప్రవచించేది అదే..  కార్మిక వర్గం, కర్షక వర్గం అని పడి కట్టు పదాలతో పక్క వాడి ఆస్తిపాస్తులు కాజేయడాన్ని లీగలైజ్ చేసేదే కమ్యూనిజం..   కమ్యూనిజం గురించి నేను ముందు రాసిన టపా ఇక్కడ చూడవచ్చు..

ఇక విశేఖర్ గారి గురించి ఏమని చెప్పాలి?? ఆయన రాసినది చూద్దాం:
పావని లాంటి వారికి గలిగిన గౌరవ భంగం కంటే మానవాళిని కాపాడగలదని నమ్మే నా సిద్ధాంతమే నాకు ముఖ్యం. ఆ విషయాన్ని పావనిలాంటి వారు కూడా అర్ధం చేసుకోగలరని నా నమ్మిక.
పక్క మనిషికి గౌరవ భంగమైనా ఈయనకు ఇబ్బంది లేదట.. ఇదెక్కడి సంస్కారమో నాకైతే తెలియదు.. పక్కనోడి భావలను గౌరవించలేని సిద్దాంతం ఒక సిద్దాంతమేనా?? అలాంటి సిద్దాంతం తో మానవాళికి ఏం విముక్తి కలుగుతుందో ఆ దేవుడికే తెలియాలి..
కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ మార్తాండ, విశెఖర్ లాంటి వాళ్ళు కమ్యూనిజం ఎందుకు ఫెయిల్ అయింది, అవుతోంది అనేదానికి classic cases గా నిలుస్తారు.. వీళ్ళు పక్కనోడిని తిడితే నోరు మూసుకుని ఉండాలి.. కానీ పక్కనోడు రెస్పాండ్ అయితే  భరించలేరు.. అందుకే,   కమ్యూనిష్టు హయాం లో ఒక తియోన్మెన్ స్క్వేర్ జరిగినా,  పోల్ పాట్ లాంటి వాళ్ళు కమ్యూనిష్టు ప్రభుత్వాలలో ఉన్నా అది వింతగా కనిపించదు.. 
p.s.: See the last comment in the screen shot, Martanda himself confessed that he is an "ఎమోషనల్ దెయ్యం " :D

బ్లాగరుడ పురాణం లో మళ్ళీ కలుద్దాం (అవసరమైతే).. అంతవరకూ శలవు!

--కార్తీక్





ఆ ముసలోడు చచ్చాడు..

6/09/2011 - రాసింది karthik at Thursday, June 09, 2011
హైందవ ద్వేషమే ఆలంబనగా జీవించిన  ఆ ముసలోడు చచ్చాడు..
సనాతన విశ్వాసాలు ఈ దేశం లో ఎంత హీన స్థితిలో ఉన్నాయో చెప్పిన ఆ ముసలోడు చచ్చడు.. 
దేవతామూర్తుల వలువలూడదీసి నగ్నత్వమే పవిత్రత అని బొంకిన ఆ ముసలోడు చచ్చాడు.. 
మరి అంత పవిత్రమైన నగ్నత్వాన్ని తన మతం వారికి ఆపాదించలేని ఆ ముసలోడు చచ్చాడు..
హిందువుల చేతకానితనానినికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆ ముసలోడు చచ్చాడు..
ఈ కర్మభూమిన హిందువుల ప్రారబ్దం ఏమిటో చాటిచెప్పిన ఆ ముసలోడు చచ్చాడు..
లౌకికత్వం పేరుతో హైందవ ధర్మం పైన జరుగుతున్న దాడికి సాక్షిగా నిలిచిన ఆ ముసలోడు చచ్చాడు..
హైందవ జాతిలోని అనైఖ్యతను సొమ్ము చేసుకున్న ఆ ముసలోడు చచ్చడు..

ఇప్పుడే చూస్తున్నా.. ఆ బూతుబొమ్మల ముసలోడు చచ్చాడంట..  జనాలు తెగ సానుభూతి చూపిస్తుంటే ఊరుకోలేక ఇది రాశా.. 

పసందైన రాజకీయం..

12/18/2009 - రాసింది karthik at Friday, December 18, 2009
ఇప్పుడు రాష్ట్ర రాజకీయం మంచి రసకందాయం లో పడింది.. ఒక పక్క కే.సీ.ఆర్. లాంటి జిన్నాలు రాష్ట్రాన్ని విడదీయటానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు మరో పక్క తాంబూలాలిచ్చిన కేంద్రం మీరు తన్నుకు చావండి అంటూ చోద్యం చూస్తోంది. కానీ ఓలుమొత్తంగా చూస్తే ఎక్కువ నష్టం కలిగింది మాత్రం కాంగ్రెస్ పార్టీకే.. ఒక వేళ తెలంగాణ ఏర్పడితే(అశుభం ప్రతిహతమౌగాక) ఆ క్రెడిట్ తె.రా.స. కొట్టేస్తుంది. మరో పక్క మిగిలిన ప్రాంతాల్లో రాష్ట్రాన్ని విడదీశారనే అపప్రధను మూట కట్టుకుని దుకాణం మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది.. ఇప్పుడు రోశయ్య ఎన్ని ఏడ్పులు ఏడ్చినా, మన్మోహన్ సింగ్ ఆవేదన వెళ్ళబుచ్చినా ఉపయోగం లేదు... ప్రజల మధ్య ఏర్పడ్డ మానసిక దూరం తగ్గే సూచనలు ఇప్పుడిప్పుడే కనపడటం లేదు.. ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఏమీ చెయ్యకుండా తాత్సారం చూపిస్తోంది అందుకే!! ఎటువంటి పరిస్థితిలో అయినా తన 'వర్గ బలంతో' చక్రం అడ్డువేయగల వై.యస్. ఇప్పుడు లేడు.. జగన్ వర్గాన్ని వరండా బ్యాచిగా తయారుచేసి ఒక బలమైన వర్గాన్ని అధిష్ఠానం దూరం చేసుకుంది..
మరో పక్క తెలుగుదేశం పరిస్థితి ఇంకా కామెడీగా ఉంది!! ప్రజల ఆగ్రహాలతో మైండ్ బ్లాక్ అయ్యిన బాబు నేడో రేపో "నా అంబారీ ఏనుగుని రిక్షాలో తీసుకురండి నేను డాల్ఫిన్ హోటల్లో కాఫీ తాగి కురుక్షేత్ర యుద్దానికి పోవాలి" అనే స్టేజిలో ఉన్నాడు.. తెలంగాణ మీద ఒక కమిటీని వేసి దానిలో అభిప్రాయ భేదాలు వచ్చి దేవెందర్ గౌడ్ లాంటి నేత పార్టీని వదిలి వెళ్ళిపోయినా కూడా ఆ అంశం లోని సంక్లిష్టతను అర్థం చేసుకోకుండా తన "ఏ ఎండకా గొడుగు" పాలసీ ఫాలో అయ్యి ఇప్పుడు సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు.. బాబు విస్వనీయత అసలే అంతంతమాత్రం..ఈ దెబ్బతో బాబుకు శంకర గిరి మాన్యాలు తప్పదనిపిస్తోంది..
ఇక మిగిలింది చిరంజీవి, తన మెగస్టార్ స్టేటస్ ను పణంగా పెట్టి మరీ రాజకీయాలకు వచ్చిన వ్యక్తి.. ఎలాగోల అధికార పీఠానికి కూతవేటు దూరం లో అయినా ఉండాలని చాలా తాపత్రయం... ఈ కక్కూర్తితోనే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుందామని ప్రయత్నించాడు. అదికాస్తా మీడియాలో "జెండా పీకేద్దాం" అని వచ్చేసరికీ గొంతులో పచ్చి వెలక్కాయ పడటంతో ఏడుస్తూ అదే పత్రికలకు ఎక్కాడు.. సామాజిక తెలంగాణ అని కబుర్లు చెప్పి ఇప్పుడు అకస్మాత్తుగా నిర్ణయాన్ని మార్చుకున్నాడు.. ఇది ఆలోచించాల్సిన విషయం!! నేను దీని గురించి ఆలోచించగా చించగా కొంత చినిగాక బల్బు వెలిగింది. రాష్ట్రం ఈ రోజు కాకపొయినా ఒక 4-5 ఏళ్ళల్లో అయినా విడిపోక తప్పదు.. అప్పుడు కోస్తాలో కాంగ్రెస్ దూకాణం మూసేసే పరిస్థితిలో ఉంటుంది.. పైగా అది తనకు కొద్దో గొప్పో పట్టున్న ప్రాంతం కనుక అందరికంటే ముందుగా సమైఖ్యాంధ్రకు జై అంటే తెలుగుదేశం కు చెక్ పెట్టచ్చు అనేది ఒక లెక్క!!
ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే జగన్ అకస్మాత్తుగా జై సమైఖ్యాంధ్ర అని ఎందుకన్నాడు?? దీన్ని అడ్డం పెట్టుకుని మేడం కు కడప స్టైల్లో రిప్లై ఇస్తున్నాడా?? (మాదీ కడపే, మేము కొట్టడం అంటు జరిగితే ఇక దెబ్బ తిన్న వాడు మళ్ళీ లేయడు.ఎంతైనా ఉడుకు రక్తం కదా :) :) ) ఇప్పుడు కాంగ్రెస్ నుంచీ జగన్,లగడపాటి అధికార కేంద్రాలుగా తాయారౌతే రాజకీయం బాగుంటుంది.. ఎందుకంటే ఇప్పటిదాకా లగడపాటి వై.యస్. వర్గానికి చెందిన వాడు. ఇక నుంచీ కూడా అలానే ఉంటాడా అనేది ఆలోచించాల్సిన విషయం..ఎందుకంటే ఎక్కడైనా బావే కానీ వంగ తోట దగ్గర మాత్రం కాదు..
ఈ మొత్తం గొడవల్ల ఒక విషయం మాత్రం విస్పష్టంగా తెలిసొచ్చింది.. అదే మన దేశం లో ప్రజలకు, రాజకీయ పార్టిలకు ఉన్న దూరం.. ఒక కమిటీ వేసి కూడా బాబు సమైఖ్యాంధ్ర గురించి తెలుసుకోలేక పోయాడంటే అంతకంటే కామెడీ లేనే లేదు.. ప్రస్తుత పరిస్థితిలో చూశ్తే చిరంజీవికి అందరికంటే ఎక్కువ లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి..

తెలంగాణ: నా అనుకోలు!

12/10/2009 - రాసింది karthik at Thursday, December 10, 2009
నా తెలుగు బ్లాగులో సీరియస్ టపాలు రాయకూడదు అని నేను ఫిక్స్ అయ్యి చాలా కాలమయ్యింది.. కాని ఇప్పుడు రాయాల్సి వస్తోంది..కారణం "తెలంగాణ" ఈ టపాలో నేను తెలంగాణా చరిత్ర,మొదటి రాష్ట్రాల పునర్విభజన కమీషన్, నెహ్రూ ఇలాంటి విషయాల జోలికి పోదలుచుకోలేదు.. ఈ అంశం గురించీ నా ఆలోచనలను బ్లాగీకరించే ప్రయత్నమే ఈ టపా.

రాష్ట్రం విడిపోతే తెలంగాణా బాగుపడుతుంది అనేది తెలంగాణా వాదుల మౌలికమైన ఉద్దేశ్యం (basic idea), దానికి వారు హిమాచల్ వగైరా రాష్ట్రాలని ఉదాహరణాలుగా చూపిస్తారు. బాగుపడే అవకాశం ఎంతుందో మరొక దోపిడీ మొదలయ్యే అవకాశం కూడా అంతే ఉంది. చిన్న రాష్ట్రమైన హిమాచల్ బాగుపడితే బీహార్ నుంచీ విడిపొయిన జార్ఖండ్ పాతాళానికి పరుగులు పెడుతూ ఉంది. రేపు తెలంగాణా నేతలు మరొక మధు ఖోడాలుగా తయారు కారని నమ్మకం ఏమిటి?? కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే అభివృద్ది అనేది నేతల మీద ఆధారపడి ఉంది తప్ప రాష్ట్రం యొక్క పరిణామం మీద కాదు.
ఇక ఇప్పటివరకూ ఏ తెలంగాణా వాది నుంచీ విడిపోవడానికి convincing reason వినలేదు. ఇక్కడ అత్యంత దురదృష్టకర పరిణామం ఏమిటంటే తెలంగాణా పేరు మీదా ఆంధ్రా వాళ్ళ మీద విషం కక్కడం. మేము తిట్టేది కేవలం రియల్ ఎస్టేట్లలో సంపాదించిన వాళ్ళను మాత్రమే అంటారు మరి ఆంధ్రా బ్యాంకు పేరు మార్చడం, ఆంధ్రా మీల్స్ అన్న బోర్డ్ కొట్టేయడం ఇవి దేన్ని సూచిస్తున్నాయి. మేము తిట్టేది బడా బాబులనే అని నాయకులు చెప్పొచ్చు కాని కాలిన కడుపులతో ఉన్న వారికి అంత విచక్షణ ఉంటుందా??? వాడికి ఆంధ్రా అన్న పదమే ఒక బూతైపోయింది. శరత్ గారు అన్నట్టు తెలబాన్లు అనే పదమే కరెక్టేనేమో!
ఇక హైదరాబాదు అనేది అత్యంత పెద్ద పీటముడి. అప్పుడింకెంత గొడవలు జరుగుతాయో! ఏమో? హైదరాబాదులో వీధి పోరాటాలు జరిగినా నేను ఆశ్చర్యపోను. దీన్ని ఎలా పరిష్కరిస్తారు??
రాష్ట్ర విభజన అనేది ఒక administrative process జరగాల్సింది ఒక sentimental injury అయ్యింది. అన్నిటికంటే పెద్ద సమస్య అది. ఇప్పుడు ఈ విషం కక్కే చేష్టల వల్ల ఇండియా-పాకిస్తాన్ వాతావరణం ఏర్పడుతుందేమోనని భయంగా ఉంది. ఎందుకంటే తెలంగాణా ఏర్పడ్డా లేకపొయినా నాకొచ్చే జీతం లో తేడా ఏమీరాదు. కానీ మనసులో ఎందుకో తెలియని బాధగా ఉంది.
నా పాయింట్ ఒక్కటె దేశన్ని ప్రాంతలకు అతీతంగ, పార్టీలకు అతీతంగ అందరూ దొచుకున్నారు. వాళ్ళకి తెలంగాణా ఐన, రాయలసీమ ఐన పెద్ద తేడా లేదు. సొ కనీసం మన తరమైనా అభివృద్ధి గురించి ఆలోచించాలి. ఒకరిని ఒకరు తిట్టుకుంటే ప్రయోజనం శూన్యం

చైనా వాడు మన దేశాన్ని 32 భాగాలుగా చేస్తే తన మార్కేట్కు పోటీగా రాకుండా ఉంటామని ప్లాన్ చేశాడట. (4 ఏళ్ళ క్రితం ఏదో పుస్తకం లో చదివాను). ఇక పాకిస్తాన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. తాలిబన్లు మన మీద షరియా విధించటానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టారు. ఇంత మంది ఇన్ని రకాలుగా మనమీద కత్తిగట్టి ఉంటే మన్మేమో కొత్త రాష్ట్రాలు తొక్క తోలు అని కొట్టుకుంటున్నాం!!
ఈ తప్పుకు చరిత్ర మనల్ని క్షమిస్తుందా??? i have no answer..


ఏది ఏమైనా తెలంగాణా రావటం ఫిక్స్ అయ్యింది కనుక ఆ ప్రాంత ప్రజలకు నా హార్దిక శుభాకాంక్షలు. ఇప్పటి వరకూ జరిగిన విష ప్రచారం ఇకనైనా ఆపాలని మనవి.

చివరగా:
మాతెలుగుతల్లికి క్షమాపణల దండ

మా కన్నతల్లికి పాదాభివందనములు

కడుపులో కత్తెర్లు
కనుపాపలో నెత్తుర్లు
చీదరింపుల చీకట్లు
ప్రసరించెను మాతల్లి

గణగణ తెలంగాణ కదలిపోతుంటేను
బిరబిర హైదరాబాద్ వీడిపోతుంటేను

కంగారు క్షణాలే దొర్లుతాయి
ముత్యాలమురిపాలు మోడులాయే

క్షమించు తెలుగు తల్లీ !

క్షమించు తెలుగు తల్లీ!

పాటకు కాపీరైట్ హక్కుదారు: ప్ర.పీ.స.స.

ఆశ్రునయనాలతో
-కార్తీక్


గమనిక:
కామెంట్లు రాసే ప్రజలు విషం కక్కే మాటలు రాస్తే నేను ఆమోదించను, నా బ్లాగుకి నేనే మోనార్కుని!