Showing posts with label తెలంగాణ. Show all posts
Showing posts with label తెలంగాణ. Show all posts

Facebook నుంచీ కాపీ చేసిన టపా!!!

8/06/2014 - రాసింది karthik at Wednesday, August 06, 2014
Copied from FB



నోరు విప్పితే ఆంధ్రా వాళ్లపై దాడి. దగా- మోసం- కుట్ర…. ఈ మూడు పదాలు నిత్యం రామ నామ జపంలా జపించి తెలంగాణ ప్రజల్ని నమ్మించి నట్టేట ముంచాడు కేసీఆర్. విభజనకు ముందు నిపుణులు, ఏపీ ముఖ్యమంత్రి గొంతి చించుకుని చెప్పారు తెలంగాణ ఆంధ్రమీద, ఆంధ్ర తెలంగాణ మీద ఆధారపడి ఉంది. ఈ రాష్ట్ర విభజన ఇరు రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది అని నెత్తీనోరు మొత్తుకున్నారు. అయినా వినలేదు. మభ్యపెట్టి… ఏదో ఒకలా ఇచ్చేయండని అన్నారు. ఈరోజు తెలంగాణ పొలాలు ఎండిపోయాయి. ఉత్తర తెలంగాణకు రైస్ బౌల్ అని పేరున్న మెదక్ జిల్లా పొలాలు గొంతెండి చూస్తున్నాయి. అవన్నీ బోరు బావుల పంటలు. కరెంటు ఉంటేనే పంటకు నీరు. దీనికి తోడు వర్షాభావం. దీంతో మెట్టరైతులు పంట వేయలేక అన్యాయం అయిపోతే బోరు బావుల కింద రైతులు పంటలు వేసి కరెంటు కోసం చూసి చూసి అది రాక అన్యాయం అయిపోయారు. హైదరాబాదు నగరానికి రోజుకు ఐదు గంటలు కోతలు పెట్టినా, అన్ని జలాశయాలు నిండుకుండలా మారినా తెలంగాణకు అవసరమైన విద్యుత్తు అందడం లేదు. ఎందుకంటే… ఈ పొలాలన్నీ ఇంతకాలం ఆంధ్రా నుంచి వచ్చే విద్యుత్తుతో పండేవి. ఇపుడు అది వేరే రాష్ట్రం, ఇది వేరే రాష్ట్రం. ఆ రాష్ట్రం తన అవసరాలు చూసుకోవడంతో తెలంగాణ రైతులు అన్యాయం అయిపోయారు.
దీనికి ఎవరు కారణం?

కచ్చితంగా తొలి దోషి టీఆర్ఎస్. ఎన్నికల ముందు అంత ఆఘమేఘాల మీద విభజన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఈరోజు రెండు రాష్ట్రాల ప్రజలను నడిరోడ్డున నిలబెట్టాల్సిన పరిస్థితి. తెలంగాణకు కరెంటు ప్రాణం, ఆంధ్రకు రాజధాని ప్రాణం. ఆంధ్రకు రాజధాని పోయి వారు తీవ్రంగా ఆదాయాన్ని కోల్పోయి నష్టపోతే… తెలంగాణలో ఉన్న వ్యవసాయం, పరిశ్రమలు నడపటానికి కీలకమైన కరెంటును నష్టపోయి ఇక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఇంత ఘోరమైన విభజన చేయకపోతే విభజన కు పార్లమెంటు సాక్షిగా డెడ్ లైన్ పెట్టి మూడేళ్లలో ఇటు కరెంటు ఉత్పత్తిని పెంచి, అటు రాజధానిని నిర్మించి రాష్ట్రాన్ని విడదీసి ఉంటే ఇరు ప్రాంతాల ప్రజలు భరోసాతో జీవించేవారు. రెండు రాష్ట్రాలు క్షేమంగా ఉండేవి. కానీ కాంగ్రెస్, టీఆర్ఎస్ అధికార దాహం ఇరు ప్రాంతాల ప్రజల పాలిట శాపమైంది. హైదరాబాదులో వేలసంఖ్యలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడే ప్రమాదం పొంచిఉంది. అక్టోబరు నుంచి నిరంతర కరెంటు సరఫరా ఉండే ఆంధ్రకు ఈ చిన్న పరిశ్రమలు తరలిపోయినా పెద్ద ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే వాటిని తరలించడం చాలా సులభం. పైగా వాటికి విద్యుత్తు అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో వారికి ఆంధ్ర మెరుగైన ఆప్షన్ అవుతుంది.

ఏ మొహం పెట్టుకుని ఆంధ్రాను అడుగుతారు ?

నిస్సిగ్గుగా, నిర్మొహమాటంగా తన తప్పులను పక్కన పెట్టి ఎదుటి వారిని వేలెత్తిచూపడంలో నోబెల్ అవార్డు అంటూ ఉంటే అది కేసీఆర్ నే వరిస్తుంది. అధికారం కోసం అత్యాస పడిన కేసీఆర్ ఇపుడు కరెంటు ఇవ్వడం చేతకాక చంద్రబాబు తాజాగా ఆగ్రహం వ్యక్తంచేశారు.
వీటీపీఎస్ నుంచి 500 ముద్దనూరు నుంచి 210 మెగావాట్లు విద్యుత్తు రావాల్సి ఉన్నా ఆంధ్రా సీఎం అడ్డుకుంటున్నారని రైతులకు ఆయన చంద్రబాబును చూపిస్తున్నారు. మరి ఇదే బుద్ధి ఫీజు రీఎంబర్స్ మెంటు విషయంలో ఏమైంది. మా పిల్లలకే ఫీజులు ఇస్తాం, మీకేం నొప్పి అని బడాయి చెప్పిన ఆయన అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఆ ప్రజలకు తన సొంత విద్యుత్తు ఇవ్వడంలో తప్పేముంది. తెలంగాణలో దశాబ్దాలుగా స్థిరపడి ఇక్కడే పుట్టి పెరిగిన వారినే పట్టించుకోనపుడు ఆ రాష్ట్రం తెలంగాణ గురించి ఎందుకు పట్టించుకుంటుంది? ఎందుకు పట్టించుకోవాలి.
విభజన చట్టం ఉల్లంఘించి ఉన్నత విద్యా మండలి పెట్టినపుడు గుర్తురాలేదా అదే చట్టం ఉల్లంఘించి వారు విద్యుత్తు ఆపేయవచ్చని?. ఉమ్మడి రాష్ట్ర జీవోను ఉల్లంఘించి ఆంధ్ర వాహనాలపై పన్ను వేసినపుడు గుర్తురాలేదా… అదే ఉల్లంఘన వారు కూడా చేయగలరని? మా రాష్ట్రం, మా విద్యావిధానం మా ఇష్టం అన్నపుడు గుర్తురాలేదా … వారు కూడా మా రాష్ట్రం మా విద్యుత్తు మా ఇష్టం అంటారని? మాకు కర్ణాటక ఎంతో ఆంధ్రా అంతే అన్నపుడు గుర్తురాలేదా… ఆంధ్రప్రదేశ్ కూడా మాకు కర్ణాటక ఎంతో, తెలంగాణ అంతే అని అనగలదని.
ఇతర రాష్ట్రాల సీఎంలు మాత్రం తమ ప్రజల ప్రయోజనాలు త్యాగం చేసి తెలంగాణకు విద్యుత్తు ఇవ్వాలా? ఎవడు నేర్పిన న్యాయం ఇది! నీ ప్రయోజనాలకు సంబంధించి చట్టం ప్రకారం జరగాలి. ఇతరుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాలు అయితే కేసీఆర్ ఇష్టం ప్రకారం జరగాలా? విభజనకు ముందు ఆంధ్రోళ్లను కడుపులో పెట్టుకుని చూసుకుంటాం అన్న మాటలు మరిచిపోయి ఆంధ్రోడు అన్న మూలం ఎక్కడున్నా వేటాడుతున్న కేసీఆర్ కు ఆ ఆంధ్రోడు ఎందుకు విద్యుత్తు ఇవ్వాలి?

(నోట్ : లాఠీ ఛార్జి జరిగితే తెలంగాణ బిడ్డలను రాక్షసంగా అణచివేస్తారా అన్న కేసీఆర్ ఈరోజు కరెంటు అడిగిన పాపానికి మెదక్ జిల్లాలో రైతులపై లాఠీ ఛార్జి చేయించాడు. పదిమంది రైతులకు ఈ సందర్భంగా తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు, పోలీసుల తీరుపై రైతులు తిరగబడటంతో రాత్రి పొద్దుపోయాక కేసీఆర్ … దీనికంతటికీ బాబే కారణం అంటూ ఆంధ్ర వైపు వేలెత్తి చూపాడు. ఈ కథనం నేపథ్యం ఇది.)

సమస్యలు: అటూ, ఇటూ ..

7/31/2013 - రాసింది karthik at Wednesday, July 31, 2013
చివరకు కేంద్రం తెలంగాణ ప్రకటించింది. ఇప్పటిదాకా తిట్టుకున్న తిట్లన్నీ మర్చిపొయి ఇప్పుడు అందరం సోదరభావంతో ఉందామని ప్రముఖులంతా ప్రకటనిస్తున్నారు.. సరే, సంతోషం!  నేను ఆ విషయం గురించి ఏమీ చెప్పదలుచుకోలేదు. విభజన కరెక్టా, కాదా అనే చర్చ కూడా ఇప్పుడు అప్రస్తుతం. ఎందుకంటే ప్రజలలో మానసికంగా విభజన జరిగి ఒక ఐదారేళ్ళకు పైగానే అయింది. ఒకరు విగ్రహాలు పగులగొట్టినప్పుడు, కవిత్వం పేరుతో బూతు పురాణాలు ప్రచురించినప్పుడు, మరొకరు ఆత్మాహుతి దళం గా మారుతాం అన్నప్పుడే మానసిక విభజన్ ఏ స్థాయిలోఓ ఉందో చూశాం.. 

ఒక సమైక్యవాదిగా సారీ ఇప్పుడు ఈమాటకు విలువ లేదు కదా, సరే ఒక సీమబిడ్డగా ఈ నిర్ణయం వల్ల మా నాకు కనిపిస్తున్న నష్టాలు:

1. హైదరాబాదు నుంచీ సీమాంధ్ర ప్రాంతాలకు బస్సు చార్జీలు పెరగడం. ఎందుకంటే అంతరాష్ట్రాల మధ్య ఉండే టాక్స్ అదనంగా కట్టాలి. ఇది సీమాంధ్రులకు మాత్రమే నష్టం కాదు. అంతకంటే ఘనుడు ఆచంట మల్లన్న అని ఇరు ప్రాంతాల వారూ మొహమాటం లేకుండా ఈ టాక్స్ వేసుకుంటారు.

2. కరెంట్ కష్టాలు అధికమవడం. సీమాంధ్రులకు సింగరేణి బొగ్గు, సాగర్ నుంచీ కరెంట్ రెండు కష్టమే.. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికే ఇవి సరిపోవడం కష్టం. కాబట్టి ఇక సీమాంధ్రులు ఎంచక్కా కరెంట్ తీగలపై బట్టలారేసుకోవచ్చు.

3. రాయలసీమలో, యస్ నా సీమలో తాగడానికి కూడా నీళ్ళు దొరకవు. కరువుసీమలో పుట్టిన పాపానికి సాగు నీళ్ళ గురించి ఆలోచించడం అత్యాసే కానీ ఇప్పుడు తాగు నీరు కూడా కష్టమే. కడప, అనంతపురం జిల్లాలో అతి త్వరలో ఎడారులుగా మారే అవకాశాలు పుష్కలం.

4. ఉద్యోగాలలో ఇబ్బందులు వస్తాయి అని ఒక వాదన. కానీ ఈరోజులలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేదే చాలా తక్కువ పోను పోను ఇంకా తగ్గిపోతాయి. కాబట్టి ఇది పరిగణలోకి తీసుకోలేము.

ఈ సమస్యలు పక్కన పెడితే ఈ తెలంగాణ ఏర్పాటు వల్ల కనీసం ఈ క్రింద చెప్పిన సమస్యలు తీరినా నేను సంతోషిస్తాను:

1. ఫ్లోరైడ్ సమస్య: మన ప్రభుత్వాల చేతగానితనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఈ సమస్య తీరితే అంతే చాలు.
2. ఐ.ఐ.టి. హైదరాబాద్ అంతర్జాతీయ సాంకేతిక కళశాలగా రూపుదిద్దుకోవాలి.
3. హైదరాబాదులో ఉన్న చిన్న చిన్న పరిశ్రమలకు నిరంతరంగా కరెంట్ ఇచ్చి అవి వేరే రాష్ట్రాలకు పోకుండా చూడాలి.
 
తెలంగాణ ఏర్పాటు వల్ల ఈ మాత్రం మేలు జరిగినా ఉద్యమానికి సార్థకత చేకూరినట్లే..


సర్వేజనా సుఖినోభవంతు
-కార్తీక్


దూసుకొచ్చిన కారు; తల్లీ పిల్లలు దుర్మరణం!

రాసింది karthik at Wednesday, July 31, 2013
న్యూఢిల్లీ, జూలై 30: ఈ రోజు సాయంత్రం ఏడుగంటల ప్రాంతం లో రాజధాని ఢిల్లీ నగరంలో JANPATH10 నంబర్ కల గులాబీ రంగు కారు ఫుట్ పాత్ పైకి దూసుకోపోవడం తో తల్లి, ఆమె పిల్లలు అక్కడిక్కడే అకాల మరణం పొందారు. ఈ దుర్ఘటన పొరపాటున జరిగింది కాదని, యస్.గాంధీ అనే విదేశీ వనిత తన కుమారుడైన రాహువును అందలమెక్కించడానికి చేస్తున్న అనేక ప్రయత్నాలలో ఒకటని అభిజ్ఞ వర్గాల భోగట్టా. ఇంతకు మునుపు ఇదే రాహువు కోసం యస్.గాంధీ బీహారీ చాత్ పూజలు చెయ్యడం, లక్నో కబాబులు తినడం లాంటి ప్రయత్నాలు కూడా చేసింది. అవి రెండూ బెడిసికొట్టడం తో నిస్సహాయురాలైన ఈ మృతురాలిని లక్ష్యం గా చేసుకుని ఈ ఘోరకలికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ఎలాంటి పొరపాట్లు కాకుండా పిగ్విజయ్ సింగ్, గులాం ఆజాద్నహీ అనే డ్రైవర్ల దగ్గర నుంచీ సలహాలు తీస్కున్నట్టు తెలిసింది. 
మృతురాలి స్వస్థలం గోదావరీ, కృష్ణ పరివాహక ప్రాంతమని తన వాళ్ళందరూ అనాథగా వదిలివేయడంతో ఢిల్లీ రోడ్ల మీద బ్రతుకుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. మరణించిన వారి వివరాలు:

పేరు: తెలుగు తల్లి
పిల్లలు: శాంతి, తేజ

మరణించిన వారి ఆత్మలకు పుణ్యలోకాలు కలగాలని కోరుకుందాం!

మరణించిన వారిపై రాసిన పాటను క్రింది వీడియో చూడగలరు:





ఈ విషయం ఈరోజు హిందూ పేపర్లో వచ్చిన ఈ లేఖను ఒకసారి చూద్దాం. 


It looks like political expediency, not development, is behind the formation of a separate Telangana. The Congress is aware that Chief Minister Kiran Kumar Reddy is from Rayalaseema and has never openly backed the demand for Telangana. It is evident that his views were not taken seriously by the party high command which appears to have made up its mind after the BJP’s strident support for the cause.
The Congress will gain nothing from its latest move. It has lost its identity in all three regions of Andhra Pradesh. The party leaders from Telangana cannot hope to perform a magic in the region as the TRS, which has been pursuing the demand since 2001, will gain an upper hand. It may well turn out to be a straight contest between the TRS and the TDP. One thing is certain. Andhra Pradesh is heading for a long phase of uncertainty and violence.
V. Sriharsha,
New Delhi
నిన్ను రక్షించుకోలేకపోయిన దౌర్భాగ్యపు జాతి మాది. క్షమించు తెలుగు తల్లీ, క్షమించు!  

ఆశ్రునయనాలతో
-కార్తీక్

కమ్యూనిజం అంటే???

12/01/2010 - రాసింది karthik at Wednesday, December 01, 2010


కమ్యూనిజం గురించి తెలుసుకోవాలంటే...


 మసకబారిన మానవత్వానికి మూగసాక్షిగా నిలిచిన తియోన్మెన్ స్క్వేర్ ను అడుగు..
ఖ్మేర్ రోగం తో కుప్పకూలిన సగటు కంబోడియా పౌరుడినడుగు..
అనువుగాని చోట అధికులమని ఆఫ్ఘన్ లో ఆశపడ్డ రష్యానడుగు..
ఇంకా తెలియలేదా కామ్రేడ్??

టిబెట్ పౌరల మృత్యుహేళి కమ్యూనిజం..
కోరియా విస్పోటనం కమ్యూనిజం..
బీటలు వారిన జర్మన్ గోడ కమ్యూనిజం.. 

ఇక మన బ్లాగు కామ్రేడ్లు చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని చూద్దాం:
కమ్యూనిజం అంటే శాంతి సామరస్యలతో కూడిన సమ సమాజం నిర్మాణం. దాని భావం అదే.

ROFL.. ప్రపంచం లో ఎక్కడైనా కమ్యూనిస్టులు అధికారం లో ఉండి ప్రశాంతంగా ఉన్న రాజ్యాలు ఉన్నాయా?? చైనా నుంచీ అల్బేనియా వరకూ కమ్యూనిజం దెబ్బకు కుదేలవని సమాజం ఎక్కడైనా ఉందా కామ్రెడ్స్??
పాపం, ఆ కంబోడియా అంత చిన్న దేశం లో మూడేళ్ళలో తమరి కామ్రెడ్స్ దాదాపుగా రెండు మిలియన్ల ప్రజలను లేపేశారట (అంటే ఆ దేశ జనాభాలో అక్షరాలా 21% హాం ఫట్!).. ఇక స్టాలిన్ గురించి ఎంత తక్కువ మాట్లడుకుంటే అంతమంచిది.. బ్రాందీ సీసాల మధ్య సోడా బాటిల్లా  ఉన్న క్యూబా మాత్రమే కొంతవరకూ మినహాయింపు..అక్కడ కూడా లోపల ఏం జరుగుతోంది అనే విషయం ఎవరికీ తెలియదు.. కనుక కామెంటు చెయ్యలేం..  క్యాస్ట్రో నాయకత్వ పటిమ వల్ల మనుగడ సాగిస్తున్నారని నా అభిప్రాయం..

NEXT:
ఈ లాభాలు గుట్టల్లా పేరుకుపోయి ఆ శ్రామికుల డబ్బును సొంతం చేసుకుంటాడు. అదే పెట్టుబడి మోసమంటే.
మరి ఆ పెట్టుబడి మోసమైతే రతన్ టాటాను బెంగాల్ లో పెట్టుబడి పెట్టమని బుద్దదేవ్ గారు అంత కిందా మీదా ఎందుకు పడ్డారు?? ఆ మాత్రం కార్ల ఫ్యాక్టరీ బెంగాల్ గవర్నమేంట్ చేత పెట్టించలేకపోయారా??
పెట్టుబడి అంతే కేవలం డబ్బు మాత్రమే కాదు కామ్రెడ్స్.. ఒక వ్యక్తి/బృందం యొక్క ఆలోచనలు/పని తత్వం కూడా.. ఆ ఆలోచనలతో నలుగురికి ఉపాధి కల్పించి వారి కడుపు నింపడం ఏ రకంగానూ తప్పు కాదు.. ఇక వీళ్ళ లాజిక్ ప్రకారం అది కడుపు నింపడం కాదు కడుపు కొట్టడం అంటే అసలు ఆ ఫ్యాక్టరీయే లేకపోతే ఉపాధి ఎక్కడి నుంచీ వస్తుంది?? ఒక విషయం వినండి కామ్రేడ్స్, మీ దృష్టిలో పెట్టుబడిదారులుగా, మీ వర్ణనలలో దోపిడీదారులుగా ఉన్న టాటా కుటుంబం తమ లాభాలలో 2/3 వంతులు సమాజం కోసం ఖర్చుపెడుతుంది..

NEXT..

ఆ తర్వాత కంపెనీ అరాచకాలను అడుగడుగునా ఎదురు నిల్చి ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఉరికంభమెక్కిన భగత్‌సింగ్‌ కమ్యూనిస్టుగాక మరెవరు. అంతేనా నైజాం అరాచకాలను..తెలంగాణా దొర వ్యవస్థను..రజాకార్లను తరిమితరిమి నీళ్లుతాగించిన తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటానికి నేతృత్వం వహించింది కూడా కమ్యూనిస్టేలే.
ఈ విషయం లో నేను చాలావరకూ ఏకీభవిస్తాను.. రజాకార్ల ఉద్యమంలో కమ్యూనిష్టుల పాత్ర ఎంతో ఘనమైనది. దానికి ఆ యోధులకు శిరసు వంచి లాల్ సలాం! కానీ ఆ ఉద్యమం కేవలం వారిది మాత్రమే అనడం కరెక్ట్ కాదు.. ఎందుకంటే ఒక వైపు కమ్యూనిష్టులు ఎంతగా పోరాడారో మరో వైపు ఆర్యసమాజ్ కార్యకర్తలు కూడా ఎంతో శ్రమలకోర్చి ప్రజలలో చైతన్యాన్ని తీసుకువచ్చారు.. ఒక రకంగా చెప్పాలంటే రజాకార్ ఉద్యమానికి కమ్యూనిష్టులు, ఆర్యసమాజ్ రెండు కళ్ళ లాంటి వారు.. అందుకు మన తరాలు వాళ్ళకు ఎంతగానో రుణపడి ఉన్నాయి..


ఇక 2జీ కుంభకోణాం గురించి, కమ్యూనిష్టులు మాత్రం నీతి నిజాయితీలు కలిగే ఉంటారన్న గ్యారంటీ ఏమిటి?? దేశాలకు దేశలు దోచుకున్న కమ్యూనిష్టు నేతలు ఉన్నారు.. మనిషిలోని అలివి కానీ స్వార్థానికి కమ్యూనిజమైనా ఏ ఇజమైనా తలవంచాల్సిందే, కనుక అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలంటే మార్పు అనేది వ్యక్తి స్థాయిలో మొదలై సమాజం స్థాయికి చేరాలి, అంతే తప్ప కమ్యూనిష్ట్లుగా మారండి నీతిమంతులు అయిపోండి అనడం మత మార్పిడుల వంటిదే.. అక్కడ దేవుడిని చూపిస్తారు ఇక్కడ ఇజాన్ని చూపిస్తారు అంతే తేడా!!


ఇక అతి కామెడీ విషయం ఒకటుంది.. ఎంత మంది గమనించారో తెలీదు.. కానీ ఈ రెండు వాక్యాలు చూడండి..
ఇది మూడవ లైనులో రాశారు..
మన దేశంలో మావోయిస్టులు పేరిట చలామణి అవుతున్నవారు ఒకరకంగా చెప్పాలంటే ఉగ్రవాదులు. తీవ్రవాదులు. వీరు..కమ్యూనిస్టులు ఒకటి కాదు. వీరికీ..కమ్యూనిస్టులకు అసలు పొంతన లేదు.
 పదమూడవ లైనులో ఇది రాశారు..

  ఇక మన మావోయిస్టుల గురించి చెప్పాలంటే వారు దారితప్పిన కమ్యునిస్టు సోదరులు అని చెప్పవచ్చు.



ROFL..

పట్టుమని పది లైన్ల పాటూ ఒకే మాట మీద నిలబడలేని మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది కామ్రెడ్స్.. ఇప్పటి వరకూ కమ్యూనిష్టులు ఎందుకు సగటు మనిషికి దూరంగా ఉన్నారో తెలుసుకోవడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అవసరం లేదేమో!!

-ఇంద్రకంటి కార్తికేయ

Few References for further reading:

http://en.wikipedia.org/wiki/Tiananmen_Square_protests_of_1989

http://en.wikipedia.org/wiki/Khmer_Rouge

http://en.wikipedia.org/wiki/Soviet_war_in_Afghanistan

తెలంగాణ: నా అనుకోలు!

12/10/2009 - రాసింది karthik at Thursday, December 10, 2009
నా తెలుగు బ్లాగులో సీరియస్ టపాలు రాయకూడదు అని నేను ఫిక్స్ అయ్యి చాలా కాలమయ్యింది.. కాని ఇప్పుడు రాయాల్సి వస్తోంది..కారణం "తెలంగాణ" ఈ టపాలో నేను తెలంగాణా చరిత్ర,మొదటి రాష్ట్రాల పునర్విభజన కమీషన్, నెహ్రూ ఇలాంటి విషయాల జోలికి పోదలుచుకోలేదు.. ఈ అంశం గురించీ నా ఆలోచనలను బ్లాగీకరించే ప్రయత్నమే ఈ టపా.

రాష్ట్రం విడిపోతే తెలంగాణా బాగుపడుతుంది అనేది తెలంగాణా వాదుల మౌలికమైన ఉద్దేశ్యం (basic idea), దానికి వారు హిమాచల్ వగైరా రాష్ట్రాలని ఉదాహరణాలుగా చూపిస్తారు. బాగుపడే అవకాశం ఎంతుందో మరొక దోపిడీ మొదలయ్యే అవకాశం కూడా అంతే ఉంది. చిన్న రాష్ట్రమైన హిమాచల్ బాగుపడితే బీహార్ నుంచీ విడిపొయిన జార్ఖండ్ పాతాళానికి పరుగులు పెడుతూ ఉంది. రేపు తెలంగాణా నేతలు మరొక మధు ఖోడాలుగా తయారు కారని నమ్మకం ఏమిటి?? కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే అభివృద్ది అనేది నేతల మీద ఆధారపడి ఉంది తప్ప రాష్ట్రం యొక్క పరిణామం మీద కాదు.
ఇక ఇప్పటివరకూ ఏ తెలంగాణా వాది నుంచీ విడిపోవడానికి convincing reason వినలేదు. ఇక్కడ అత్యంత దురదృష్టకర పరిణామం ఏమిటంటే తెలంగాణా పేరు మీదా ఆంధ్రా వాళ్ళ మీద విషం కక్కడం. మేము తిట్టేది కేవలం రియల్ ఎస్టేట్లలో సంపాదించిన వాళ్ళను మాత్రమే అంటారు మరి ఆంధ్రా బ్యాంకు పేరు మార్చడం, ఆంధ్రా మీల్స్ అన్న బోర్డ్ కొట్టేయడం ఇవి దేన్ని సూచిస్తున్నాయి. మేము తిట్టేది బడా బాబులనే అని నాయకులు చెప్పొచ్చు కాని కాలిన కడుపులతో ఉన్న వారికి అంత విచక్షణ ఉంటుందా??? వాడికి ఆంధ్రా అన్న పదమే ఒక బూతైపోయింది. శరత్ గారు అన్నట్టు తెలబాన్లు అనే పదమే కరెక్టేనేమో!
ఇక హైదరాబాదు అనేది అత్యంత పెద్ద పీటముడి. అప్పుడింకెంత గొడవలు జరుగుతాయో! ఏమో? హైదరాబాదులో వీధి పోరాటాలు జరిగినా నేను ఆశ్చర్యపోను. దీన్ని ఎలా పరిష్కరిస్తారు??
రాష్ట్ర విభజన అనేది ఒక administrative process జరగాల్సింది ఒక sentimental injury అయ్యింది. అన్నిటికంటే పెద్ద సమస్య అది. ఇప్పుడు ఈ విషం కక్కే చేష్టల వల్ల ఇండియా-పాకిస్తాన్ వాతావరణం ఏర్పడుతుందేమోనని భయంగా ఉంది. ఎందుకంటే తెలంగాణా ఏర్పడ్డా లేకపొయినా నాకొచ్చే జీతం లో తేడా ఏమీరాదు. కానీ మనసులో ఎందుకో తెలియని బాధగా ఉంది.
నా పాయింట్ ఒక్కటె దేశన్ని ప్రాంతలకు అతీతంగ, పార్టీలకు అతీతంగ అందరూ దొచుకున్నారు. వాళ్ళకి తెలంగాణా ఐన, రాయలసీమ ఐన పెద్ద తేడా లేదు. సొ కనీసం మన తరమైనా అభివృద్ధి గురించి ఆలోచించాలి. ఒకరిని ఒకరు తిట్టుకుంటే ప్రయోజనం శూన్యం

చైనా వాడు మన దేశాన్ని 32 భాగాలుగా చేస్తే తన మార్కేట్కు పోటీగా రాకుండా ఉంటామని ప్లాన్ చేశాడట. (4 ఏళ్ళ క్రితం ఏదో పుస్తకం లో చదివాను). ఇక పాకిస్తాన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. తాలిబన్లు మన మీద షరియా విధించటానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టారు. ఇంత మంది ఇన్ని రకాలుగా మనమీద కత్తిగట్టి ఉంటే మన్మేమో కొత్త రాష్ట్రాలు తొక్క తోలు అని కొట్టుకుంటున్నాం!!
ఈ తప్పుకు చరిత్ర మనల్ని క్షమిస్తుందా??? i have no answer..


ఏది ఏమైనా తెలంగాణా రావటం ఫిక్స్ అయ్యింది కనుక ఆ ప్రాంత ప్రజలకు నా హార్దిక శుభాకాంక్షలు. ఇప్పటి వరకూ జరిగిన విష ప్రచారం ఇకనైనా ఆపాలని మనవి.

చివరగా:
మాతెలుగుతల్లికి క్షమాపణల దండ

మా కన్నతల్లికి పాదాభివందనములు

కడుపులో కత్తెర్లు
కనుపాపలో నెత్తుర్లు
చీదరింపుల చీకట్లు
ప్రసరించెను మాతల్లి

గణగణ తెలంగాణ కదలిపోతుంటేను
బిరబిర హైదరాబాద్ వీడిపోతుంటేను

కంగారు క్షణాలే దొర్లుతాయి
ముత్యాలమురిపాలు మోడులాయే

క్షమించు తెలుగు తల్లీ !

క్షమించు తెలుగు తల్లీ!

పాటకు కాపీరైట్ హక్కుదారు: ప్ర.పీ.స.స.

ఆశ్రునయనాలతో
-కార్తీక్


గమనిక:
కామెంట్లు రాసే ప్రజలు విషం కక్కే మాటలు రాస్తే నేను ఆమోదించను, నా బ్లాగుకి నేనే మోనార్కుని!